అమ్స్టెల్వీన్ (నెదర్లాండ్స్): హాకీ ప్రపంచకప్ను విజయంతో ఆరంభించిన భారత్కు రెండో పోరులో చుక్కెదురైంది. ఈ టోర్నీలో 32 ఏండ్లుగా ఇంగ్లండ్పై నెగ్గని భారత్.. తాజా ఎడిషన్లోనూ ఆ గండాన్ని అధిగమించలేకపోయింది. పూల్-డీలో భాగంగా సోమవారం జరిగిన పోరులో భారత్ 2-4తో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. తొలి అర్థ భాగం ముగిసేసరికి 2-1తో ఆధిక్యంలో నిలిచి విజయంపై ఆశలు రేపిన మన జట్టు.. రెండో భాగంలో ప్రత్యర్థికి మూడు గోల్స్ ఇచ్చుకుని ఓడింది.
భారత్ తరఫున కెప్టెన్ హర్మన్ప్రీత్ (17వ నిమిషంలో), దిల్ప్రీత్ సింగ్ (25వ) తలో గోల్ చేయగా ఇంగ్లండ్ నుంచి నికోలస్ (14వ, 55వ) రెండు, స్టువర్ట్ (39వ), హెన్రీ క్రాఫ్ట్ (43వ) చెరో గోల్ చేశారు. బుధవారం జరిగే పోరులో పాకిస్థాన్పై విజయం లేదా డ్రా సాధిస్తేనే భారత్ తదుపరి రౌండ్ చేరుకుంటుంది.