హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసి 2023లో క్రమబద్ధీకరించిన అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ (టీజీఎల్ఏ) డిమాండ్ చేసింది. ప్రొబేషనరీ డిక్లరేషన్, వార్షిక ఇంక్రిమెంట్లు, ఇతర సర్వీస్ సమస్యలు పరిష్కరించాలని కోరింది.
సోమవారం మంత్రి వాకిటి శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించింది. తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించినట్టు రాష్ట్ర అధ్యక్షుడు కుమార్ తెలిపారు. కోశాధికారి ఉపేందర్, నాయకులు మోహన్, రామ్మోహన్, అనిల్రెడ్డి, భాను రవి తదితరులు వినతిపత్రం సమర్పించిన వారిలో ఉన్నారు.