స్వాతంత్య్ర స్ఫూర్తి వెల్లివిరియాలని, ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగరాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం ములుగు మండల కేంద్రంలో ఇంటింటికీ తిరిగి జాతీయ జెండాలను మంత్రి పంపిణీ చేశారు. గ్రామంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం వజ్రోత్సవ వేడుకలపై అటవీ కళాశాలలో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నిర్వహించ నున్న కార్యక్రమాల గురించి వెల్లడిం చారు. రెండు, మూడు రోజుల్లో జిల్లాలోని 3లక్షల ఇండ్లకు జాతీయ పతాకాలను అందజేస్తామన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ములుగులో 75వ భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని మంగళవారం స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఇంటింటికీ తిరిగి జాతీయ జెండాలను పంపిణీ చేసి గ్రామంలో నిర్వహించిన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. అంతకు ముందు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబూజగ్జీవన్రామ్, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అటవీ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సీపీ శ్వేత, జిల్లా స్థాయి అధికారులతో కలిసి ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో దేశభక్తి పెంపొందించే విధంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతీయ జెండా ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ జెండాలను పంపిణీ చేస్తున్నదన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ జాతీయ జెండా అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ మేరకు జిల్లాలోని మూడు లక్షల ఇండ్లకు పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ కమిషనర్లు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో రెండు, మూడు రోజుల్లో జాతీయ జెండాలను అందజేస్తారన్నారు.
అనంతరం వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లాలో ఏర్పాటు చేయనున్న కార్యక్రమాల గురించి విలేకరులకు మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, గజ్వేల్, వంటిమామిడి ఏఎంసీ చైర్మన్లు శ్రీనివాస్, జహంగీర్, అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు సలీం, టీఆర్ఎస్ యువత విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జుబేర్పాషా, ములుగు సర్పంచ్ బట్టు మాధవీఅంజిరెడ్డి, ఎంపీపీ పెద్దబాల్ లావణ్యాఅంజన్గౌడ్, జడ్పీటీసీ నర్సంపల్లి జయమ్మాఅర్జున్గౌడ్, పీఏసీఎస్, ఎంపీపీ, ఏఎంసీ, ఉపాధ్యక్షులు నరేశ్గౌడ్, భూపాల్రెడ్డి, దేవేందర్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.