అందోల్/ నర్సాపూర్/ కౌడిపల్లి, జూలై 18 ; 24గంటల ఉచిత విద్యుత్తో రైతులంతా సంబురంగా వ్యవసాయం చేసుకుంటుంటే, కేవలం మూడు గంటలు చాలంటూ కుట్రలు చేస్తున్న రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా రైతులంతా కదం తొక్కాలని అందోల్ ఎమ్మెల్యే కాంత్రి కిరణ్ పిలుపునిచ్చారు. ఉచిత విద్యుత్పై కాంగ్రెస్ వైఖరి, రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం రాయికోడ్ మండలం సింగితం రైతు వేదికలో రైతులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్యరాష్ట్రంలో కాంగ్రెస్ వ్యవసాయరంగాన్ని నిర్లక్ష్యం చేసిందని, రైతులను ఎన్నో కష్టాలకు గురిచేసిందని మండిపడ్డారు. ఉచిత కరెంట్ వద్దన్న పార్టీని తరమికొట్టాలని, రేవంత్ వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి రైతువేదికలో ఏర్పాటు చేసిన సమావేశానికి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ వస్తే చీకటి రోజులొస్తాయని, కరెంట్తీగలపై బట్టలు ఆరబెట్టుకోవాల్సి వస్తుందని హేళన చేశారన్నారు. నేడు సీఎం కేసీఆర్ హయాంలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అందిస్తూ దేశానికి ఆదర్శంగా నిలిపారని గుర్తుచేశారు. మూడు పంటల ప్రభుత్వమే (బీఆర్ఎస్) కావాలని రెండు సమావేశాల్లో రైతులంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు.
సమైక్యపాలన నాటి కష్టాల నుంచి గట్టెక్కి స్వరాష్ట్రంలో సంతోషంగా ఎవుసం చేసుకుంటుంటే మూడుగంటలు చాలంటూ కరెంటు కుట్రలు స్పష్టించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై రైతులు కదంతొక్కాలని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన రాయికోడ్, మండలపరిధిలోని సింగితం రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మాట్లాడుతూ రైతు రక్షకుడు సీఎం కేసీఆర్ అని, ఆయన ఆధ్వర్యంలో రైతులందరికీ అన్నివిధాలా మంచి జరుగుతుందన్నారు. ఉచిత విద్యుత్పై కాంగ్రెస్ వైఖరి, రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. సమైక్యరాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని నిర్లక్ష్యం చేసి రైతులను గోసపెట్టిన పాపం కాంగ్రెస్దేనని మండిపడ్డారు. ఉచిత కరెంటు వద్దన్న కాంగ్రెస్ను ఖతంచేయాలని రైతులకు పిలుపునిచ్చారు. రేవంత్ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మండలంలోని వివిధ గ్రామాల రైతులు కాంగ్రెస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరంతరంగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నిరసన తెలిపినందుకు ఎమ్మెల్యే రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. సమావేశంలో జడ్పీటీసీ మల్లికార్జున్పాటిల్, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు బస్వరాజుపాటిల్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సిద్దన్నపాటిల్, మండల సర్పంచ్లఫోరం అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ విఠల్, వరం వైస్చైర్మన్ తుకారంకురమ, ఏఎంసీ వైస్చైర్మన్ మారుతి, రాష్ట్ర బీఆర్ఎస్వీ కార్యదర్శి నాజీంపాటిల్, మండల బీఆర్ఎస్ మండల కార్యదర్శి శంకర్, బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ప్రశాంత్పాటిల్, మల్లెశం, ఇస్మాయిల్పాటిల్, అడివయ్య, బస్వరాజుపాటిల్, అంజీ, చంద్రశేఖర్, సర్పంచ్లు హనుమంతు, నాగార్జున, ప్రవీణ్కుమార్, ఎంపీటీసీలు, రైతు సమన్వయ సభ్యులు పాల్గొన్నారు.
ఎకరం కూడా తడవదు
రేవంత్రెడ్డి చెప్పినట్లు మూడు గంటలు కరెంటు ఇస్తే ఎకరం కూడా తడవదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల విద్యుత్తో రెండు పంటలూ పండిస్తున్న. రైతుబంధు, రైతుబీమా అందించి బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో రైతులందరినీ ఆదుకుంటుంది. కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు, రైతులందరూ మద్దతు తెలపాలి.
– మల్లికార్జున్పాటిల్, జడ్పీటీసీ
హస్తం నేతల కుట్రలు తిప్పికొట్టాలి
ఉచిత విద్యుత్ రద్దుకు కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను రైతులు తిప్పికొట్టాలి. కాంగ్రెస్ హయాంలో కరెంటు కోతలతో రైతులు ఇబ్బంది పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల ఉచిత కరెంట్తో రైతులకు వెసులుబాటు కలిగింది. అవసరానికి అనుగుణంగా పొలాలకు నీటిని వినియోగించుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై వస్తున్న ఆదరణ చూడలేక కాంగ్రెస్ నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారు. ప్రజలు, రైతులందరూ జాగ్రత్తగా ఉండాలి.
– ప్రభాకర్రెడ్డి, సంగాపూర్ రైతు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు