రోడ్డుపై ఉండే గీతలను అవగాహన చేసుకోవాలి
మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
మెదక్ అర్బన్, జూన్17: యాక్సిడెంట్ అంటే ఓ బైకో, కారో రోడ్డు మీద పడటం కాదు ఓ కుటుంబం రోడ్డున పడటం అని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రహదారులపై తెలుపు గీతలు, పసుపు లైన్లు, సంజ్ఞలు, సంకేతాలు, రోడ్డుపై మనకు రకరకాల రేఖలు కనిపిస్తుంటాయి. చాలామందికి వీటి ఆర్థం తెలియదు. కొందరైతే అసలు పట్టించుకోరని, ప్రతి గీతకో పరమార్థం ఉందన్నారు. వాటిపై అవగాహన పెంచుకుంటేనే ప్రమాదాలు జరుగకుండా ఉంటాయని, మన తలరాతను మార్చే శక్తి ఆ గీతలకు ఉందని, వాటి గురించి వివరించారు.