పటాన్చెరు/పటాన్చెరు టౌన్, ఏప్రిల్ 12: ముస్లింలను అన్ని రంగాల్లో ప్రొత్సహిస్తున్నామని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరులోని జీఎమ్మార్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. మైనార్టీ సంక్షేమానికి సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి చేస్తున్న కృషికి ధన్యవాదాలు తెలిపారు. ముస్లింలకు ఐనోల్ గ్రామంలో కేటాయించిన స్థలం పత్రాలను వేదికపై పటాన్చెరు తహసీల్దార్ పరమేశం ఎమ్మెల్యే, ముస్లింలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పెద్ద ఇఫ్తార్ దావత్ను పటాన్చెరులో చూశానన్నారు. ముస్లింలకు ఇఫ్తార్, రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ముస్లింలకు ఉన్నత విద్య అందించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించి మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. షాదీ ముబారక్, ఇతర సంక్షేమ పథకాల్లోను ముస్లింలకు ఆర్థికంగా అండగా ఉంటున్నారన్నారు. నియోజకవర్గంలోని ఈద్గాలు, మసీదులు, దర్గాలను ఎమ్మెల్యే అభివృద్ధి చేశారని ఎంపీ అభినందించారు.
ముస్లింల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. రంజాన్ ఉపవాస దీక్షలను విరమింపజేసే కార్యక్రమం ఇఫ్తార్ విందును విజయవంతం చేసిన ముస్లింలకు ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు కలసి మెలసి ఉంటారన్నారు. అందరి పండులను గౌరవించే మంచి సంప్రదాయం ఇక్కడ ఉందన్నారు. ఐనోల్ గ్రామంలో ముస్లింలకు ఖబ్రస్థాన్ను (శ్మశానవాటిక)ను కేటాయిస్తున్నామన్నారు. కార్యక్రమంలో శాసనమండలి మాజీ ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కే.సత్యనారాయణ, ఎంపీపీ ఈర్లదేవానంద్, జడ్పీటీసీ కుమార్గౌడ్, నగేశ్, కొలన్బాల్రెడ్డి, దశరథ్రెడ్డి, వెంకట్రెడ్డి, అన్వర్పటేల్, లియాకత్ అలీ, మెరాజ్ఖాన్, యూనూస్, మొయిన్, తహసీల్దార్ పరమేశం, పార్టీ పట్టణ అధ్యక్షుడు అఫ్జల్ అలీ, సీఐలు వేణుగోపాల్రెడ్డి, వినాయక్రెడ్డి, మెరాజ్ఖాన్, అజ్మత్, ఆర్ఐ ఖాజా, తదితరులు పాల్గొన్నారు.
పటాన్చెరు, ఏప్రిల్ 12: మేరు కులస్తుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరులోని జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మేరు కులస్తుల ఆత్మీయ సదస్సులో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని కులస్తులకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించి ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. బీరంగూడ గుట్టపై వివిధ కుల సంఘాలకు వేయి గజాల చొప్పున స్థలం అందిస్తామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మేరు కులస్తులకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. గతంలో టైలర్స్ అసోసియేషన్ సంఘానికి 450 గజాల స్థలాన్ని ఇంద్రేశంలో ఇచ్చామని తెలిపారు. రెండు సంఘాలకు 225 గజాల స్థలం కేటాయిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మేరు సంఘానికి భవిష్యత్తులో అండగా నిలుస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కే.సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్కుమార్, మేరు మండల కమిటీ, సలహాదారులు, మాజీ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.