మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డికి సౌమ్యుడు, మృదుస్వభావి అని పేరుంది. ప్రజల మధ్య ఉండే నాయకుడని ఆయనకు గుర్తింపు ఉంది. అలాంటి మంచి మనిషిపైన హత్యాయత్నం జరగడం దుబ్బాక నియోజకవర్గ ప్రజలతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా తనపని తానే చేసుకుంటూ పోయే ఇలాంటి మనిషిపై దాడి చేయడానికి చేతులు ఎలా వచ్చాయంటూ ప్రశ్నిస్తున్నారు. చీమకైనా హానిచేయని మంచి మనసున్న నాయకుడని, ఎవరి వద్ద రూపాయి ఆశించకుండా నిస్వార్థంతో ప్రజాసేవకు అంకితమైన వ్యక్తి అని కొనియాడుతున్నారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే కొత్త ప్రభాకర్రెడ్డి సేవాభావాన్ని చాటుకుంటూ సమాజసేవలో ముందున్నారు. కేపీఆర్ ట్రస్టు ఏర్పాటు చేసి 2007 నుంచి దుబ్బాక నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సొంతంగా డబ్బులు ఖర్చుచేసి యువతకు డ్రైవింగ్ లైసెన్స్లు, పోటీ పరీక్షల అభ్యర్థులకు భోజనం పెట్టించి ఉచితంగా కోచింగ్ ఇప్పించారు. ఇన్ని మంచి పనులు చేసిన కొత్త ప్రభాకర్రెడ్డిపై దాడిని అందరూ ఖండిస్తున్నారు.
సిద్దిపేట ప్రతినిధి/దుబ్బాక, అక్టోబర్ 31(నమస్తే తెలంగాణ): మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డికి సౌమ్యుడు, మృదుస్వభావి అని పేరుంది. ఆయన ఎప్పుడూ చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ, అందరితో కలిసిపోయే నాయకుడిగా ఈ ప్రాంతంలో గుర్తింపు ఉంది. అలాంటి వ్యకిపైన హత్యాయత్నం చేయడంపై దుబ్బాక నియోజకవర్గ ప్రజలతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా తనపని తానే చేసుకుంటూ పోయే ఇలాంటి మంచి మనిషిపై దాడి చేయడానికి చేతులు ఎలా వచ్చాయంటూ ప్రశ్నిస్తున్నారు. చీమకైనా హాని చేయని మంచి మనసున్న నాయకుడు…నిస్వార్థంతో ప్రజాసేవ చేస్తూ..మానవతకు మారుపేరుగా.. తలలో నాలుకలా నిలుస్తున్నారు ఆయన. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు సహకారంతో భారీగా నిధులు తెచ్చి దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నరు. ఎంపీ కేంద్ర నిధులు రాబడుతూ అనేక సమస్యలు పరిష్కరిస్తున్నారు. సొంతంగా డబ్బులు ఖర్చుచేసి యువతకు డ్రైవింగ్ లైసెన్స్లు ఇప్పించారు. పోటీ పరీక్షల అభ్యర్థులకు భోజనం పెట్టించి ఉచితంగా కోచింగ్ ఇప్పించారు. ఇన్ని మంచి పనులు చేసిన కొత్త ప్రభాకర్రెడ్డిపై దాడులు చేయడంతో ఆయన మేలు జరిగిన వారంతా ఆవేదన చెందుతున్నారు.
రాజకీయాల్లోకి రాకముందు నుంచే కొత్త ప్రభాకర్రెడ్డి సేవాభావాన్ని చాటుకుంటూ సమాజసేవలో ముందున్నారు. 2007లో కేపీఆర్ ట్రస్టు ఏర్పాటు చేసి దుబ్బాక నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సోనీ ట్రావెల్స్ యజమానిగా ప్రభాకర్రెడ్డి హైదరాబాద్లో రవాణా రంగంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. సంపన్నుడు అయినప్పటికీ ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో పలుకిరిస్తూ.. స్నేహపూరితంగా ఉంటూ వస్తున్నారు. ఎంత ఎదిగినా .. ఒదిగి ఉండే నైజం ప్రభాకర్రెడ్డిది. ఆయన వ్యక్తిగత స్వభావాలే ఆయనను ఎంపీ స్థాయికి ఎదిగేలా చేశాయి. ప్రభాకర్రెడ్డి కేపీఆర్ ట్రస్టు (స్వచ్ఛంద సంస్థ ) ద్వారా దుబ్బాక నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు,బ్యాగులు, షూ పంపిణీ చేశారు.గ్రామాల్లో సర్పంచ్ల కోరిక మేరకు వీధి దీపాలు ఏర్పాటు, ప్రజలకు శుద్ధ్దమైన తాగునీటి కోసం సొంత డబ్బులు వెచ్చించి వాటర్ ప్లాంట్లు నిర్మించారు.గల్ఫ్ దేశాల్లో మృతి చెందిన వారికి, నిరుపేదలకు తనవంతుగా ఆర్థిక సహాయ సహకారాలు అందించారు. 2008లో వర్షాలు లేక తీవ్ర కరువుతో రైతులు అల్లాడిపోతుంటే గ్రామాల్లో వరుణ యాగాలు నిర్వహించారు. కూడవెల్లి , దుబ్బరాజేశ్వర ఆలయాల వద్ద జరిగే జాతరలో వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. స్వగ్రామంలో హనుమాన్ ఆలయం నిర్మించి పదేండ్లుగా శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.తెలంగాణ ఉద్యమంలో తనవంతుగా ఉద్యమకారులకు ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. ఆపదలో ఉన్నవారికి సహాయం అందించి ఆప్తుడిగా మారారు.కొత్త ప్రభాకర్రెడ్డి ఎంపీగా కొనసాగుతున్నప్పటికీ ఎక్కడా ఆయనపై ఒక్క అవినీతి ఆరోపణ రాలేదు. పైరవీలు చేయలేదు. విమర్శకుల నుంచి సైతం మెప్పు పొందడం ఆయనకే చెల్లింది. తన వద్దకు వచ్చిన వారికి రాజకీయాలకు అతీతంగా సాయంచేసి అందరి మనుసును గెలుచుకున్నారు. ఎవరి వద్ద రూపాయి ఆశించకుండా నిస్వార్థంతో ప్రజాసేవకు అంకితమయ్యారు. నియోజకవర్గంలో సూమారు 15 వేల మందికి సొంత డబ్బులతో డ్రైవింగ్ లైసెన్సులు అందజేశారు. వంద మంది దివ్యాంగులకు స్కూటీలు అందజేశారు. ఎన్నో రకాల సేవలు అందించి అభిమాన నాయకుడిగా ప్రజాదరణ చూరగొన్నాడు. ఇలాంటి మంచి మనిషికి ఎంత కష్టం వచ్చే అని ప్రజలంతా బాధ పడుతున్నారు. ఆయన త్వరగా కోలుకుని తిరిగి సేవా కార్యక్రమాలు చేపట్టాలని భగవంతుడిని వేడుకుంటున్నారు.
ఎంపీ ప్రభాకర్రెడ్డి త్వరగా కోలుకోవాలని ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ప్రత్యేక పూజలు, మృత్యుంజయ హోమాలు చేశారు. సర్వమత ప్రార్థనలు చేశారు. సీఎం కేసీఆర్ అడుగు జాడల్లో నడుస్తున్న కొత్త ప్రభాకర్రెడ్డి మంత్రి హరీశ్రావుకు ఆప్తమిత్రుడిగా ఉంటూ, వారి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నారు. నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా నిరంతరం ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఎంపీగా ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారు. జన్మనిచ్చిన ‘దుబ్బాక’ ఉద్యమ గడ్డకు తనవంతు సేవలను అందించాలన్న లక్ష్యంతో ఎమ్మెల్యేగా పోటీచేసేందుకు ముందుకు వచ్చారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదం, మంత్రి హరీశ్రావు సహకారంతో దుబ్బాక శాసనసభ స్థానానికి పోటీకి సిద్ధ్దమయ్యారు. దుబ్బాక నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజల నుంచి ఆయనకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలు పన్ని ఆయనపై హత్యాయత్నానికి ఒడిగట్టాయి. కాంగ్రెస్ పార్టీ కీచకుడు పాల్పడ్డ దుశ్చర్య దుబ్బాకలో ఒక్కసారిగా అలజడి సృష్టించింది.
రాయపోల్, అక్టోబర్ 31 : మంచి మనిషి మనసున్న మహారాజు కండ్ల ముందే ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై దుండగుడు కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేయడం దారుణం. అప్పటి వరకు గ్రామ సమస్యలు, ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడుతూ గ్రామస్తులతో నృత్యాలు చేశాడు.గ్రామంలో పాస్టర్ తల్లి మృతిచెందగా వారి కుటుంబసభ్యులను పరామర్శించి బయటకు వస్తుండగా ఎంపీపై కత్తితో దాడిచేయడం గ్రామస్తులను తీవ్రంగా కలిచివేసింది. ఎన్నికల సమయంలో ఓట్ల ప్రచారం ఉండాలే కానీ ఇలాంటి అరాచకాలు ఎప్పుడూ చూడలేదు. సూరంపల్లిలో ఈ ఘటన జరగడం బాధగా ఉంది.
రాయపోల్, అక్టోబర్ 31: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ఉత్సాహంగా ప్రజలకు వందనాలు చేస్తూ ప్రచారం ప్రారంభించారు. మా గ్రామంలోని అన్నివర్గాలు ఘనస్వాగం పలికాయి. చౌరస్తా వద్ద ప్రజల సమస్యలు,గ్రామ అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఎంపీ సంతోషంగా ఉన్నాడు. ఇంతలోనే దుండగుడు కత్తితో దాడి చేయడంపై కంట నీరు పెట్టించింది. మచ్చలేని వ్యక్తి, అలాంటి వ్యక్తి రెండు సార్లు ఎంపీగా గెలిచాడు. ఎవరికీ హాని చేయని వ్యక్తికి ఇలాంటి ఘటన జరగడం చూసి రాత్రికూడా నిద్ర పట్టలేదు. దేవుడి దయతో అయన త్వరగా కోలుకొని క్షేమంగా రావాలని భగవంతుడిని వేడుకుంటున్నాం.
రాయపోల్, అక్టోబర్ 31: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై కత్తితో దాడి చేయడం చలించివేసింది. గ్రామస్తులందరూ ఆయనకు బ్రహ్మరథం పట్టారు. “గుర్తుల గుర్తుంచుకో రామక్క.. కారును గుర్తుంచుకో రామక్క” అనే పాటకు ఉత్సాహంగా యవకులతో కలిపి నృత్యం చేశాడు. మా గ్రామస్తులకు ఎంతో సంతోషం కలిగించింది. ప్రజల మధ్య ప్రభాకర్రెడ్డి ఉండడం ఓర్వలేని వారు కుట్ర చేశారు. మచ్చలేని నాయకుడిపై కత్తితోదాడి చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది.
దుబ్బాక టౌన్, అక్టోబర్ 31: బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి పై హత్యాయత్నం చేయడం సరైంది కాదు. ఏ పార్టీ నాయకులకు ఇట్ల జరిగిన సహించొద్దు. నిందితుడిని విచారించి కఠినంగా శిక్షించాలి. ప్రభాకర్రెడ్డి మంచి నాయకుడు. ఎవరితోకూడాదురుసుగా మాట్లాడే వ్యక్తి కా దు. ఆయనది మంచి మనుసు. ఇతరులకు హాని చేయని వ్యక్తి. ఇలాంటి నాయకుడి పై హత్యాయత్నం చేయడం దుర్మార్గం. అల్లా ఆయన్ను త్వరగా కోలుకునేలా చూడా లి. తొందరగా ప్రజల మధ్యకు రావాలని కోరుకుంటు న్నా. ఆయన కుటుంబానికి ధైర్యాన్ని మనమంతా ఇద్దాం.
దుబ్బాక టౌన్, అక్టోబర్ 31: దుబ్బాక ప్రాంతంలో ఇటువంటి హత్యా రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు. మెదక్ ఎంసీ కొత్త ప్రభాకర్రెడ్డి సారు చాలా మంచి వ్యక్తి. తెలంగాణ వచ్చేందుకు ఎంతో ఉద్యమాలు చేసినా ఇలాంటి దాడులు జరగలేదు. ఏ పార్టీల రాజకీయం ఆ పార్టీలకు ఉంటుంది. కానీ హత్యలతో రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదు. మెదక్ ఎంపీ సాబ్పై దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి. దాడికి గల కారణాలను తెలుసుకోవాలి. ప్రభాకరన్న త్వరగా కోలుకొని ప్రచారాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నా.
మిరుదొడ్డి, అక్టోబర్ 31: మంచి నాయకుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిని చంపాలని చూసిండ్రు. గప్పుడైతే ఎలచ్చన్లు అచ్చినయంటే ఎంతో గమ్మతుగా ఓట్లు ఎయ్యాలని అడిగెటోళ్లం.కానీ గిట్ల కత్తులతో పొడిచి చంపడానికి ఎల్లడం మంచిగ లేదు. కత్తితో పొడిచిన దుండగుడు గటని రాజును కఠినంగా శిక్షించాలి. ఆ భగవంతుడి దయ వల్ల ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభాకర్రెడ్డి సారు త్వరగా కోలుకుని ప్రచారం చేయాలని ఆ దేవుడిని కోరుతున్నా. గిట్ల పొడుసుడు చంపడం మంచిది కాదు అన్నదమ్ములోలే కలిసుండి ఎన్నికల్లో అందరూ ప్రచారం చేసుకోవాలని కోరుతున్నా.
మిరుదొడ్డి, అక్టోబర్ 31 : సూరంపల్లిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి,ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పై కత్తితో దాడి చేసిన రాజును గట్టిగా శిక్షించాలి. ఆయన ఏమన్నాడని కత్తితో పొడిసిండు..ఎందుకు పొడిసిండు. మనకు ఏమన్న అవుసరం ఉంటే నాయకులకు చెప్పి చెయ్యమని అగగాలే గానీ గిట్ల ఏమి సెప్పకుండా దగ్గరికి పొయ్యి కత్తులతో పొడుసుడేంది. దీని వెనుక ఎవ్వలున్నా వాళ్లను వదిలిపెట్టొద్దు. బుద్ధి వచ్చే విధంగా దుండగుడికి బుద్ధిచెప్పాలని కోరుతున్నా. దేవుడే కొత్త ప్రభాకర్రెడ్డిని కాపాడిండు.