మనోహరాబాద్, నవంబర్ 24 : ప్రజాసంక్షేమమే ప్రభు త్వ ధ్యేయమని జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్, ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని రా మాయిపల్లి, రంగాయిపల్లి గ్రామాల్లో గౌడ సం ఘం, ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసి, భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజా పక్షపాతి అని పేర్కొన్నారు. అంతరించిపోతున్న కుల వృత్తులకు జీవం పోసేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్తోనే దేశాభివృద్ధి సాధ్యం..
సీఎం కేసీఆర్తో దేశాభివృద్ధి సాధ్యమని ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డి అన్నారు. రామాయిపల్లిలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులను దేశప్రజలు స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ ఓట్ల రాజకీయం చేస్తేంటు.. సీఎం కేసీఆర్ మాత్రమే ప్రజల కోసం పని చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించి చరిత్ర సృష్టించడం ఖాయ మన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాల య చైర్మన్ చంద్రాగౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహేశ్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు రతన్లాల్, వైస్ ఎంపీపీ విఠల్రెడ్డి, సర్పంచ్లు నాగభూషణం, పార్వతీమల్లేశ్, ఉప సర్పంచ్ వెంకటేశ్ముదిరాజ్, ఆత్మకమిటీ డైరెక్టర్ భిక్షపతి, టీఆర్ఎస్ నాయకులు నరేందర్గౌడ్, బాలు, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.