మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 7: టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సోమవారం జిల్లా కేంద్రం లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారుల ఇండ్లకు నేరుగా వెళ్లి స్వయంగా అందించారు. ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలుకరిస్తూ స్థానిక సమస్యలు తెలుసుకుంటూ పర్యటించారు. ఎమ్మెల్యే స్వయంగా ఇంటికి వచ్చి చెక్కులు అందజేయడంపై లబ్ధిదారులు, మహిళలు హారతి పట్టి స్వాగతించారు. కొవిడ్ నేపథ్యంలో జనం గుమిగూడకుండా తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, ఆయా వార్డు కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, లక్ష్మీనారాయణగౌడ్, మేడి కల్యాణి, జయశ్రీ, చందన, సమియొద్దీన్, సులోచన తదితరులతో కలిసి ఎమ్మెల్యే నిరాడంబరంగా పర్యటించారు. 20 వార్డుల్లో 33 మంది లబ్ధిదారులకు రూ. 33లక్షల 36వేల 828 కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డితో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. ఎమ్మెల్యే వెంట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శంకర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గంగాధర్, గడ్డమీది కృష్ణాగౌడ్, టీఆర్ఎస్ నాయకులు దుర్గాప్రసాద్, శివరామకృష్ణ, ప్రభురెడ్డి, ఉమర్, సురేశ్, జావేద్, ఎంఐఎం నాయకుడు ఆంజాద్ ఉన్నారు.
పేదింటి ఆడపడుచులకు కల్యాణలక్ష్మి వరం
పేదింటి ఆడపడుచులకు కల్యాణలక్ష్మి ఒక వరమని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. గౌతోజిగూడెం, పర్కిబండ, పోతారం గ్రామాలకు చెందిన 15 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను సోమవారం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కల్లూరి హరికృష్ణ, ఉప సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రేణుకుమార్, శివ్వంపేట టీఆర్ఎస్ అధ్యక్షుడు రాజరమణాగౌడ్, సర్పంచ్లు అర్జున్, వెంకటేశ్వర్లు, మాధవరెడ్డి, తహసీల్దార్ భిక్షపతి, సీఐ శ్రీధర్, మాజీ జడ్పీటీసీ నారాయణగౌడ్, ఉప సర్పంచ్లు వీరేశ్, క్యాతమ్మ, నాయకులు ప్రభాకర్రెడ్డి, నర్సింహులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
శివ్వంపేట మండలంలో
కల్యాణలక్ష్మి పథకం నిరుపేద ఆడబిడ్డ తల్లిదండ్రులకు ఓ వరం అని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. శివ్వంపేట మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ కల్లూరి హరికృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మండలంలోని 38 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మదన్రెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీటీసీ పబ్బా మహేశ్గుప్తా, జడ్పీ కోఆప్షన్ మెంబర్ మన్సూర్, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్చారి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు లావణ్యామాధవరెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు..
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే మదన్రెడ్డి అ న్నారు. మాసాయిపేటలో సోమవారం మండలంలోని 20 మం ది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి అందుతున్నాయన్నారు. పథకాల రూపకల్పన, అమలులో తనదైన ముద్ర వేస్తూ సీఎం కేసీఆర్ అందరినీ ఆదుకుంటున్నారని కొనియాడారు. అన్ని రంగాల వారికి న్యా యం చేస్తున్న సీఎం కేసీఆర్ వ్యవసాయంతో పాటు విద్య, వైద్యం, ఉపాధి, కార్మికులు వంటి అన్ని వర్గాలను ఆదుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీవో శ్యాంప్రకాష్, తహసీల్దార్ మాలతి, సర్పంచ్లు మధుసూదన్రెడ్డి, నర్సింహులు, గోపి, శంకర్, కనకమ్మ, నాయకులు నరేందర్రెడ్డి, స్టే షన్ శ్రీను, బాల్రెడ్డి, ఆర్ఐ ధన్సింగ్లతో పాటు పలువురు స ర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.