రామాయంపేట, జూలై 14: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అం దించడానికి ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’ అమలు చేస్తున్నదని, ఆంగ్ల విద్యను అందిస్తామని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం మెదక్ జిల్లా రామాయంపేటలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..‘మన ఊరు-మనబడి’లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభు త్వ పాఠశాలల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు రూ.7.300 కోట్లు కేటాయించినట్లు తెలిపా రు.
రామాయంపేటలోని ప్రభుత్వ బాలికల ఉన్న త పాఠశాల నూతన భవన నిర్మాణానికి రూ. 1.20కోట్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అదనంగా మరో రూ.10లక్షలను కేటాయిస్తున్న ట్లు మంత్రి తెలిపారు. తెలిపారు.అన్ని హంగుల తో పాఠశాలను తీర్చిదిద్దుతామన్నారు. ఏడాదిలో పు నూతన బడి నిర్మాణం పూర్తిచేయలని డీఈ వో రమేశ్ను ఆదేశించారు. తాత్కాలిక భవనంలో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలన్నారు. రా మాయంపేట మున్సిపల్ అభివృద్ధ్దికి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి హరీశ్రా వు వెల్లడించారు. మున్సిపల్ చైర్మన్ వినతి మేరకు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ది విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని, సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నార ని తెలిపారు.
కార్య క్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, ఆర్డీవో సాయిరాం, డీఈవో రమేశ్, ము న్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, వైస్ చైర్పర్సన్ పుట్టి విజయలక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ బాదెచంద్రం, కౌన్సిలర్లు దేమె యాదగిరి, గజవాడ నాగరాజు, తహసీల్దార్ మన్నన్, ఎంపీడీవో యాదగిరిరెడి,్డ ఎంఈవో నీలకంఠం, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు కొండల్రెడ్డి, దేవుని రాజు, కృష్ణాగౌడ్, ఎస్కే హైమద్, మర్కు దత్తు, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.