అందోల్, ఫిబ్రవరి 21: సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల ద్వారా గజ్వేల్, సిద్దిపేట కంటే అందోల్ ని యోజకవర్గానికే ఎక్కువగా 1.70 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇదంతా అందోల్ నియోజకవర్గ ప్రజలు, ఎమ్మెల్యే క్రాంతికిరణ్ చేసుకున్న అదృష్టమని అన్నారు. ఇక్కడి సమస్యలు పరిష్కారమవ్వాలంటే స్థానికుడే ఎమ్మెల్యేగా ఉండాలని ప్రజలు పట్టుబట్టి క్రాంతికిరణ్ను గెలిపించుకున్నారన్నారు. అంతకుముందు అందోల్లో అందరూ ఫారిన్ ఎమ్మెల్యేలు ఉండేవారన్నారు. క్రాంతికిరణ్ హయాంలో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెం దుతున్నదని మెచ్చుకున్నారు. అందోల్- జోగిపేట మున్సిపాలిటీల అభివృద్ధికి, రోడ్ల మరమ్మతులకు నిధులు కావాలని మంత్రి హరీశ్రావు ద్వారా ఎమ్మెల్యే అడిగారన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నానని సీఎం కేసీఆర్ తెలిపారు. రోడ్ల మరమ్మతులకూ ని ధులు కేటాయిస్తున్నానన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ త లాపునే మంజీరా ఉన్నా ఆ నీటిని వినియోగించుకోలేని దు స్థితి ఇక్కడి రైతులదని, ఇప్పుడు సీఎం కేసీఆర్ హయాంలో అందోల్ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని అన్నారు. సీఎం కేసీఆర్తోనే ఇదంతా సాధ్యమైందని, ఇంత గొప్ప పథకానికి సీఎం శంకుస్థాపన చేయడం, తాను ఎమ్మెల్యేగా భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాంత రైతులు సీఎంకు రుణపడి ఉంటారన్నారు.