మెదక్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): అందరూ అధికారులు సమన్వయంతో వ్యవహరించి గణతంత్ర వేడుకలను జయప్రదం చేయాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ ఆదేశించారు. గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులతో ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 26న ఉదయం 9గంటలకు కలెక్టరేట్ ఆవరణలో జరిగే వేడుకల్లో కలెక్టర్ హరీశ్ జాతీయపతాకాన్ని ఆవిషరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారని తెలిపారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని డీఎస్పీ (ఏఆర్) శ్రీనివాస్ను ఆదేశించారు.
పోలీసు శాఖ సమన్వయంతో బారికేడింగ్, పారిం గ్, వేదిక ఏర్పాటుతో పాటు కలెక్టరేట్ లోపల, వెలుపలికి వెళ్లే దారిని లెవెలింగ్ చేయాలని ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. వేదికను పలు రంగుల పూలతో అందంగా అలంకరించాలని ఉద్యా నశాఖ అధికారికి, విద్యుత్లో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాల్సిందిగా విద్యుత్ శాఖాధికారిని ఆదేశించారు. పట్టణమంతా శుభ్రం గా ఉండేలా చూడాలని మైదానం లో వాటరింగ్ చేయాలని, సు న్నపు లైనింగ్ వేయాలని మున్సిపల్ కమిషనర్నుఆదేశించారు. జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రసంగం రూ పొందించాల్సిందిగా ముఖ్య ప్రణాళిక అధికారిని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులచే దేశభక్తిని పెంపొందించే సాంసృతిక కార్యక్రమాలు ఆరుకు మించకుండా చూడాలని డీఈవో రమేశ్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డిని ఆదేశించారు.
ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వా న పత్రికను ముద్రించి అతిథులను, స్వాతంత్య్ర సమరయోధులను ఆహ్వానించి సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, ట్రై కలర్స్లో కలెక్టరేట్ను ఒకరోజు ముందుగా లైటింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టరేట్ ఏవోకు సూచించారు. అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు అందుబాటులో ఉంచాలన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువతను సమీకరించాలని డీఆర్డీవో, మె ప్మా, జిల్లా యువజన సంక్షేమాధికారులకు సూచించారు. స్టాల్స్ ఏర్పాటుతో పాటు రుణాల పంపిణీకి సంబంధిత అధికారులు సిద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్ ర మేశ్ సూచించారు. వేడుకలు విజయవంతంగా నిర్వహించేలా పర్యవేక్షించాల్సిందిగా ఏడీ మైన్స్ జయరాజ్కు ఆదేశించారు. సమావేశంలో అధికారులు జయరాజ్, కృష్ణమూర్తి, కేశూరం, జెంలా నాయక్, విజయలక్ష్మి, బ్రహ్మాజీ, ఆశాకుమారి, ఇందిరా, రజిని, చిన్నసాయిలు, కాసీం,శ్రీనివాస్ రావు, రాజేంద్రప్రసాద్, రమేశ్కుమార్, రాజిరెడ్డి, ర జాక్, వేణుగోపాల్రావు, యూనూస్ పాల్గొన్నారు.