మెదక్, ఆగస్టు 17 : సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి పుట్టిన రోజు వేడుకలు మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలో అంబరాన్నంటాయి. పట్టణంలోని కలెక్టరేట్ నుంచి ఆటోనగర్, పాత బస్టాండ్ మీదుగా రాందాస్ చౌరస్తా, పోస్టాఫీస్, కొత్త బస్టాండ్ నుంచి వైస్రాయ్ గార్డెన్స్ వరకు టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు పెద్దఎత్తున వాహనాల ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డికి అభిమానులు స్వాగతం పలికారు. మెదక్-చేగుంట చౌరస్తాలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్గౌడ్, టీఆర్ఎస్ లీగల్ సెల్ జిల్లా కార్యదర్శి, యువ న్యాయవాది జీవన్రావుల ఆధ్వర్యంలో వాహనాల ర్యాలీ నిర్వహించారు.
పట్టణంలోని వైస్రాయ్ గార్డెన్స్లో ఎమ్మెల్సీ శేరి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీని జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, హవేళీఘణాపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్కుమార్, యువ న్యాయవాది జీవన్రావు, హవేళీనణాపూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాజేందర్రెడ్డి, టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు గజమాలతో సన్మానించారు. అనంతరం కేక్ కట్చేసి, అభిమానులు, కార్యకర్తలకు తినిపించారు. రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్గౌడ్ ప్రారంభించారు.
ఎమ్మెల్సీ శేరి పుట్టిన రోజు సందర్భంగా సర్వమత పెద్దలు ప్రార్థనలు చేసి ఆశీర్వదించారు. సుభాష్రెడ్డి మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని, ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు. పుట్టిన రోజు వేడుకల్లో ఆయా మండలాల నుంచి పెద్దఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఎలాంటి సహాయమైనా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి తెలిపారు. మెదక్ పట్టణంలోని వైస్రాయ్ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని హామీనిచ్చారు. మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు.