చేగుంట, మే 15 : ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం లాంటిదని నార్సింగి ఎంపీపీ చిందం సబిత అన్నారు. మండల పరిధిలోని వల్లూర్ గ్రామానికి చెందిన చాకలి తిరుమలయ్య ఇటీవల అనారోగ్యానికి గురై ఓ దవాఖానలో చికిత్స పొందాడు. వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి దరఖాస్తు చేసుకోగా.. ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.60వేల చెక్కును బాధిత కుటుంబానికి శనివారం ఎంపీపీ అందజేశారు. వారి వెంట వల్లూర్ గ్రామ సర్పంచ్ అనందాస్ మహేశ్వరి, గొండస్వామి, మల్లేశం తదితరులు ఉన్నారు.
వెంకటరావుపేటలో…
తొగుట, మే 15 : సీఎం సహాయనిధి పేదలకు వరం లాంటిదని జడ్పీటీసీ గాంధారి ఇంద్రసేనారెడ్డి అన్నారు. వెంకట్రావుపేటలో శనివారం మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిల సహకారంతో మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను జడ్పీటీసీ గాంధారి ఇంద్రసేనారెడ్డి గ్రామానికి చెందిన ఎంగలి స్వరూపకు రూ.60వేలు, కంకనాల స్వామికి రూ.22,500, ఎంగలి సత్తయ్యకు రూ.19,000, కె.శ్రవంతికి రూ.25వేలను అందజేశారు. ఆయన వెంట టీఆర్ఎస్ మండల అధ్యక్షులు చిలువేరి మల్లారెడ్డి, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కంకణాల నర్సింహులు, సర్పంచ్ పాత్కుల లీలాదేవి వెంకటేశం, రైతు సమన్వయ సమితి కన్వీనర్ బండారు స్వామిగౌడ్, రాజమౌళి, వేణుగోపాల్రెడ్డి ఉన్నారు.
రామాయంపేటలో…
రామాయంపేట, మే 15 : రామాయంపేట పట్టణంలో ఆరో వార్డుకు చెందిన మంగళ సత్తమ్మ అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతుంది. దీంతో వారు సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.32వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును శనివారం బాధితురాలి భర్త మంగళి నర్సింహులుకు ఆరో వార్డు కౌన్సిలర్ దేమె యాదగిరి అందజేశారు.