కౌడిపల్లి, ఏప్రిల్ 11 : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు పెంచాలని మెదక్ కలెక్టర్ హరీశ్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ మాస్క్లు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. ప్రతిఒక్కరూ వ్యా క్సిన్ తీసుకోవాలని వెల్లడించారు. కలెక్టర్ వెంట మెడికల్ ఆఫీసర్ వెంకట్యాదవ్, సిబ్బంది ఉన్నారు.
కరోనా టీకా తీసుకోవాలి
కరోనా వ్యాక్సిన్ టీకా ప్రతిఒక్కరూ తీసుకోవాలని ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, ఎంపీడీవో యాదగిరిరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని డి.ధర్మారం ప్రభుత్వ దవాఖానలో ఝాన్సీలింగాపూర్ సర్పంచ్ పంబాల జ్యోతితో కలిసి టీకా వేయించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ 45 ఏండ్లు పైబడిన వారు టీకా తీసుకోవాలని సూచించారు.
కొనసాగుతున్న వ్యాక్సినేషన్
మనోహరాబాద్, శివ్వంపేట మండలాల్లోని గ్రామాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్నది. వైద్యాధికారులు గ్రామాల్లో పర్యటించి 45 ఏండ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. కాళ్లకల్లో నిర్వహించిన కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఎంపీటీసీ లావణ్య, ఇన్చార్జి సర్పంచ్ కాళిదాస్ పాల్గొని మాట్లాడారు.
ఇమాంపూర్లో వ్యాక్సినేషన్ కేంద్రం పరిశీలన
45 ఏం డ్లు పైబడిన ప్రతిఒక్కరూ కొవిడ్ వాక్సిన్ వేయించుకోవాలని డీపీవో తరుణ్కుమార్ అన్నారు. మండలంలోని ఇమాంపూర్లో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ కేం ద్రాన్ని ఎంపీవో రమేశ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కరోనా వైరస్పై పూర్తిస్థాయిలో ప్రజ ల్లో అవగాహన కల్పించాలన్నారు. గ్రామంలోని ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేవిధంగా ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు కృషి చేయాలన్నారు.
రెడ్డిపల్లి పీహెచ్సీలో 17 కేసులు నమోదు
మండలంలోని రెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం 17 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని వైద్యురాలు డా.ప్రియదర్శిని తెలిపారు. 109 మందికి పరీక్షలు నిర్వహించగా, 17 మందికి పాజిటివ్గా తేలిందని పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 73, మండలంలోని నత్నాయిపల్లి క్యాంపులో 101, నర్సాపూర్ ఏరియా దవాఖానలో 85 మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు.
మాస్క్లు ధరించకుంటే రూ.వెయ్యి జరిమానా
బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు ధరించకుంటే రూ. వెయ్యి జరిమానా విధిస్తామని ఎస్సై గంగరాజు హెచ్చరించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం మాస్క్ ధరించని వారికి రూ.వెయ్యి జరిమానాతోపాటు శిక్షను విధించేలా ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. బహిరంగ ప్రదేశాలు, పని ప్రాం తాల్లో తప్పని సరిగా మాస్క్లు ధరించాలని సూచించారు.
కరోనా నుంచి కోలుకోవాలని ప్రార్థనలు
కరోనా బారిన పడ్డ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్ కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని టీఆర్ఎస్ నాయకులు మల్యాల కిషన్, విద్యాసాగర్ పేర్కొన్నారు. ఆదివారం రామాయంపేట సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలు చేశారు.
ఇవీ కూడా చదవండి…
పదేండ్లు అధికారంలో ఉండి మీరు చేసిందేమిటి?: మంత్రి హరీశ్
టాలీవుడ్కు కష్టమే : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ థియేటర్ల బంద్ ?
దారితప్పి బావిలోపడ్డ ఏనుగుపిల్ల.. రక్షించిన అధికారులు.. వీడియో