మనోహరాబాద్, ఏప్రిల్ 2 : నిజాంపేట మండలాభివృద్ధికి కృషి చేస్తానని జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. మనోహరాబాద్లోని జడ్పీ క్యాం పు కార్యాలయంలో నిజాంపేట మం డలంలో జరుగుతున్న అభివృద్ధి పను ల వివరాలపై జడ్పీటీసీ పంజా విజయ్కుమార్తో చర్చించారు. వైకుంఠధామాలు, పల్లె ప్రకృ తి వనాలు, డంపింగ్యార్డుల నిర్వాహణలతో పాటు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. మండలంలో వివిధ అభివృద్ధి పనులకు జడ్పీ నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మండల కేంద్రంలో ఈ నెల 14 నుంచి జరుగనున్న పెద్దమ్మ ఆలయ ఉత్సవాలకు హాజరుకావాలని ఆహ్వాన పత్రికను ముదిరాజ్ సంఘ సభ్యులు జడ్పీ చైర్ పర్సన్ గకు అందజేశారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం గ్రామ అధ్యక్షుడు మా సుల రాజు, సభ్యులు శ్రీనివాస్, లక్ష్మీనర్సింహులు, సత్త య్య, పోచయ్య, బాబు, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.