మెదక్, డిసెంబర్ 24 : ఏసు ప్రభువు దీవెనలు అందరికి ఉండాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆకాంక్షించారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అన్ని పండుగలకు సమప్రాధాన్యతనిస్తున్నారని పేర్కొన్నారు. ఆసియా ఖండంలోనే అతి పెద్ద రెండో చర్చి జిల్లా కేంద్రమైన మెదక్లో ఉండడం గర్వకారణమని అన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ పండుగను ప్రజలు ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.