జహీరాబాద్, ఫిబ్రవరి 4: దేశ ప్రజలు రైతు రాజ్యం రావాలని బీఆర్ఎస్ను స్వాగతిస్తున్నారని, మహారాష్ర్టలోని నాందేడ్లో ఎక్కడ చూసినా ప్రజలు స్వచ్ఛందగా ముందుకు వస్తున్నారని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ తెలిపారు. శనివారం నాందేడ్లో బీఆర్ఎస్ బహిరంగ సభకు జన సమీకరణ కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం నాందేడ్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు పలువురు రాష్ర్ట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారని తెలిపారు. మహారాష్ర్టలో బీఆర్ఎస్ను ఆశీర్వదించేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, బీఆర్ఎస్ నాయకులు, రైల్వే బోర్డు సభ్యుడు షేక్ ఫరీద్, తదితరులు పాల్గొన్నారు.