పటాన్చెరు, అక్టోబర్ 29: పటాన్చెరులో గులాబీదళం కదం తొక్కింది. బీఆర్ఎస్లో పటాన్చెరు నియోజకవర్గంలోని పలువురు కాంగ్రెస్ నాయకులు చేరారు. వారిని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కే సత్యనారాయణ, యూపీ మాజీ ఎమ్మెల్యే మనోజ్కుమార్ సింగ్, బీఆర్ఎస్ నాయకులు శంకర్యాదవ్ పార్టీలోకి ఆహ్వానించారు. ఆదివారం పటాన్చెరు పట్టణంలో ఎటు చూసినా బీఆర్ఎస్ శ్రేణులతో జనసంద్రమైంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కదిలిరావడంతో పట్టణమంతా గులాబీమయమైంది. మైత్రీ మైదానం నుంచి జీఎమ్మార్ కన్వెన్షన్హాల్ వరకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డితో కలిసి అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు పట్టణ సీనియర్ నాయకుడు విజయభాస్కర్రెడ్డి, కృష్ణయాదవ్, సంతోష్యాదవ్, మహేశ్యాదవ్, మల్లేశ్యాదవ్, కాజీపల్లి, ముత్తంగి గ్రామాలకు చెందిన పలువురు నాయకులు, యువకులు బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి మాట్లాడుతూ అన్ని పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో స్వచ్ఛందంగా చేరుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ పదేండ్లలో చేసిన అద్భుతమైన ప్రగతిని చూసి ప్రతిపక్ష పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. పటాన్చెరులో తాను చేసిన అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని కోరారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కే సత్యనారాయణ మాట్లాడుతూ పటాన్చెరులో ప్రతి ప్రాంతం వారు మాకు సోదర సమానులన్నారు. వారి అభ్యున్నతికోసం పాటుపడుతామన్నారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. అనంతరం బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు, వివిధ సంఘాల నాయకులు ప్రసంగించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్కుమార్, కార్పొరేటర్లు మెట్టు కుమార్యాదవ్, పుష్పానగేశ్యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్, మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్యయాదవ్, సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, బాల్రెడ్డి, నర్రా భిక్షపతి, వరప్రసాద్రెడ్డి, గూడెం మధుసూదన్రెడ్డి, గూడెం యాదమ్మ, గూడెం కల్పన, శ్రీధర్చారి, సందీప్ షా, పార్టీ పట్టణాధ్యక్షుడు అఫ్జల్ అలీ తదితరులు పాల్గొన్నారు.
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డికి కేరళ రాష్ట్రం వాసులకు చెందిన మలయాళీ సంక్షేమ సంఘం ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. ఆదివారం పటాన్చెరు పట్టణంలోని జీఎమ్మార్ కన్వెన్షన్హాల్లో కేరళ రాష్ట్రీయులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే మహిపాల్రెడ్డికి వారంతా ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. కేరళ మలయాళీ సంక్షేమ సంఘం తరపున ఎమ్మెల్యేను గెలిపించుకుంటామని హామీనిచ్చారు. ఈ సందర్భంగా కేరళ సంక్షేమ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఎమ్మెల్యేకు మద్దతుగా ఉంటామని, ఎన్నికల్లో విజయం సాధించేలా సహకారం అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నగేశ్యాదవ్, కేరళ మలయాళీ అసోసియేషన్ ప్రతినిధులు వినోద్, బినోయ్ జోసెఫ్, సలీం, వాసుదేవన్, ప్రసాద్, అజయన్, మధుసూదన్ పిైల్లె తదితరులు పాల్గొన్నారు.
ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఇతర ఉత్తర భారత రాష్ర్టాల ప్రజలుండే ప్రాంతాల్లో నెలరోజుల పాటు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి కోసం స్వచ్ఛందంగా ప్రచారం చేస్తానని ముస్లింపుర మాజీ ఎమ్మెల్యే మనోజ్కుమార్ ఠాకూర్ అన్నారు. హిందీ మాట్లాడే వారి జనాభా పటాన్చెరు నియోజకవర్గంలో ఎక్కువగా ఉందని, వారికి ఎమ్మెల్యే మంచితనం తెలపాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తనకు పటాన్చెరు నుంచి ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కే సత్యనారాయణ, శంకర్యాదవ్తో మంచి సాన్నిహిత్యం ఉందన్నారు. వారందరి ఆశీస్సులతో నియోజకవర్గం ప్రచారం చేసి బీఆర్ఎస్ను అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు.