గజ్వేల్, ఏప్రిల్ 2: మహారాష్ట్రకు చెందిన రైతు సంఘం నేతలు ఆదివారం గజ్వేల్, వర్గల్, ములుగు, మండలాల్లో పర్యటించి అభివృద్ధ్దిని పరిశీలించారు. ముందుగా ములుగు రైతు వేదికకు చేరుకున్న బృందం సభ్యులకు ఎమ్మెల్సీ విఠల్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ జహంగీర్, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి ఘనస్వాగతం పలికారు.