సిద్దిపేట, సెప్టెంబర్ 11: నాడు ఉద్యమంలో ముందున్నం…నేడు అభివృద్ధిలోనూ ముందుం టామని, సిద్దిపేట ప్రజలు ఉద్యమంలో పాల్గొన్న రోజుల్లో ప్రతిపక్షాలు ఎకడున్నయ్, ఉద్యమం చేసిన గడ్డ సిద్దిపేట అని ఆర్థిక వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు.. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో పట్టణంలోని పలు సామూహిక భవనాల మంజూరు పత్రాలను సంఘాల ప్రతినిధులకు మంత్రి అందజేశారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిద్దిపేట, గజ్వేల్నేనా అభివృద్ధి అని నిన్న రేవంత్రెడ్డి మాట్లాడాడు. సిద్దిపేట తెలంగాణ ఉద్యమగడ్డ, సిద్దిపేట ప్రజలు రాష్ట్రం కోసం ఉద్యమం చేసి జైలుకు వెళ్లినప్పుడు ఈ ప్రతిపక్షాలు ఎకడికిపోయాయి, ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నం. అభివృద్ధి చేసుకుంటామని మంత్రి తెలిపారు.
సమైక్య పాలనలో ఈ ప్రాంతం గోస పడ్డదన్నారు. 60 ఏండ్లలో లేని అభివృద్ధి ఈ తొమ్మిది ఏండ్లలో ఎవరు చేశారో సిద్దిపేట ప్రజలు ప్రతిపక్షాలను ప్రశ్నించాలన్నారు. దశాబ్దాల కలలైన సిద్దిపేట జిల్లా, గోదావరి జలాలు, రైలును సిద్దిపేటకు తీసుకొచ్చామని మంత్రి చెప్పారు. ఈనెల 15న బుల్లెట్ స్పీడ్తో రైలు రాబోతుందన్నారు. సిద్దిపేటలో రైలు ఎకితే హైదరాబాద్, తిరుపతి, బెంగళూరుకు పోతామని, సిద్దిపేట ప్రజలు ఎకడికి వెళ్లినా గౌరవం పెంచామన్నారు. సిద్దిపేట అభివృద్ధి చూసి ఓరుస్తలేరు అంటే ఆ స్థాయిలో అభివృద్ధిని మనం చేసుకున్నామని, సిద్దిపేట ప్రజల గొప్ప చైతన్యవంతులన్నారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసుకుందామని మంత్రి హరీశ్రావు చెప్పారు.
మంజూరు పత్రాలు అందజేత
పట్టణంలో ఒకటోవార్డులో విశ్వకర్మ భవనానికి రూ.5 లక్షలు, శాలివాహన భవనానికి రూ.5 లక్షలు, 2వ వార్డులో ముదిరాజ్ భవనానికి రూ.10 లక్షలు, రెడ్డి సంఘం భవనానికి రూ.15 లక్షలు, 4వ వార్డులో వడ్డెర సంఘం భవనానికి రూ.10 లక్షలు, 10వ వార్డులో గౌడ సంఘం భవనానికి రూ.10 లక్షలు, 12వ వార్డులో నాయీబ్రాహ్మణ సంఘం భవనానికి రూ.20 లక్షలు, నీలకంఠ యూత్ భవనానికి రూ.5 లక్షలు, 15 వ వార్డులో బీరప్పభవనానికి రూ.6 లక్షలు, జంగం భవనానికి రూ.15 లక్షలు, 30వ వార్డులో కిచెన్షెడ్ నిర్మాణానికి రూ.25 లక్షల మంజూరు పత్రాలను ప్రతినిధులకు మంత్రి హరీశ్రావు అందజేశారు.