న్యూఢిల్లీ : ఉక్రెయిన్లో నౌకపై జరిగిన దాడిలో నలుగురు భారతీయులు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. జూలై 19న సాయంత్రం ఒడెసా పోర్టు నుంచి ఐదుగురు భారతీయులతో సహా 17మందితో గినియా-బిస్సావు జెండా కలిగిన ఎంవీ గోల్డెన్ నౌక ధాన్యం తీసుకెళ్తుండగా దాడి జరిగింది. ఈ దాడిలో నలుగురు భారతీయులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు ఉక్రెయిన్లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నారని విదేశాంగశాఖ తెలిపింది.
పరిస్థితిని ఉక్రెయిన్లోని ఇండియన్ ఎంబసీ నిశితంగా పరిశీలిస్తోందని చెప్పింది. ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండిస్తున్నట్టు విదేశాంగశాఖ నోట్ విడుదల చేసింది. నోట్లో రష్యా పేరు విదేశాంగశాఖ ప్రస్తావించలేదు. ఉక్రెయిన్ మాత్రం రష్యానే దాడి చేసిందని ఆరోపించింది.