నారాయణఖేడ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ హవా కొనసాగుతున్నది. రోజురోజుకు పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులు అవుతున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నాగల్గిద్ద, సిర్గాపూర్, కంగ్టి మండలాలకు చెందిన దాదాపు ఐదువందల మంది హస్తం, కమలం పార్టీ నాయకులు ఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. గ్రామాల్లో గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.
– సిర్గాపూర్/నాగల్గిద్ద/ కంగ్టి, ఆగస్టు 29
కంగ్టి/ సిర్గాపూర్/ నాగల్గిద్ద, ఆగస్టు 29: నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. కంగ్టి మండలంలోని నాగన్పల్లికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పలువురు నాయకులు సోమవారం రాత్రి ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. చేరిన వారిలో వడ్ల సాయన్న, వడ్ల పండరి, సీఎం తుకారం, ధన్రాజ్, పుండప్ప, గాలప్ప, పీరప్ప, గౌతమ్, శివరాజ్, రాజు, కాశీనాథ్, దత్తు, పప్పు, జైశీల్, ఇసాక్, శర్ణప్ప, డెవీడ్, ఆనంద్, ఏశప్ప, రవికుమార్, సాయప్ప, అనిల్, దూలప్ప, రామప్ప, లక్ష్మణ్, మహాబూబ్, హైమద్, అసిఫ్, అబ్రహం, వైద్యనాథ్, సాయిగొండతోపాటు వారికుటుంబసభ్యులు ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంగారం, సిర్గాపూర్ మండల ఉపాధ్యక్షుడు మాధవ్రావు, నాయకులు సురేశ్పాటిల్, సుధాకర్రెడ్డి పాల్గొన్నారు.
సిర్గాపూర్కు గ్రామ పంచాయతీకి చెందిన వార్డు సభ్యులు మచ్కూరి విఠల్, గుండన్న, శంకర్, రామయ్య తదితరులు కాంగ్రెస్, బీజేపీలను వదిలి దాదాపు 100 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సంజీవరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఇందులో జడ్పీటీసీ రాఘవరెడ్డి, యాదవరావుపాటిల్, నాయకులున్నారు. మంగళవారం నాగల్గిద్ద మండలం కారాముంగి గ్రామానికి చెందిన 350మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఎమ్మెల్యే భూపాల్రెడ్డి సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ ఎమ్మెల్యే కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ పండరీ యాదవ్, ఎంపీపీటీ రమేశ్, నాయకులు ప్రహ్లాద్, నందుపటేల్ తదితరులున్నారు. బీఆర్ఎస్లో చేరినవారు మాట్లాడుతూ బీఆర్ఎస్తోనే ఖేడ్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, ప్రగతిని చూసి పార్టీలో చేరుతున్నామని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భూపాల్రెడ్డిని మరోమారు భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పారు.