చేర్యాల, జనవరి 31: కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి లడ్డూ మరింత రుచికరంగా ఉండే విధంగా ఆలయ అధికారులు, పాలకమండలి శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మల్లన్న క్షేత్రంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మంగళవారం ఎమ్మెల్యే పరిశీలించారు. స్వామివారి ప్రసాదాలు లడ్డూ, పులిహోర తయారు తీరును స్వయంగా పరిశీలించి, లడ్డూను తిని రుచిని పరీక్షించారు. స్వామివారి కల్యాణం, పట్నం, లష్కర్ వారాల సందర్భంగా ఆలయానికి వచ్చిన ఆదాయంపై ఆరా తీశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రత్యేక కృషితో మల్లన్న క్షేత్రం అభివృద్ధి చెందుతున్నదన్నారు. ఆలయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, మరిన్ని అభివృద్ధి పనులు సైతం చేపట్టనున్నట్లు తెలిపారు.
మల్లన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, దానికి అనుగుణంగా ముందుకు సాగుతున్నట్లు వివరించారు. భక్తులకు సేవలందించడమే ధ్యేయంగా ఆలయ అధికారులు, పాలక మండలి పనిచేయాలని సూచించారు. ఆలయ పరిధిలోని చేపట్టిన అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు సకాలంలో పనులు పూర్తిచేసే విధంగా కాంట్రాక్టర్లను పురమాయించాలన్నారు. రూ.13కోట్లతో నిర్మించే క్యూలైన్లకు టెండర్ల ప్రక్రి య పూర్తి చేసి గుత్తేదారునికి పనులు అప్పగించి దర్శనం కోసం భక్తులు పడుతున్న కష్టాలు లేకుం డా చేస్తామన్నారు. ఆలయ అధికారులు, సిబ్బంది, అర్చకులు, ఒగ్గుపూజారులతో పాటు పాలక మం డలి చైర్మన్, డైరెక్టర్లు క్రమశిక్షణతో భక్తులకు సేవ చేయాలన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గీస భిక్షపతి, డైరెక్టర్లు నర్ర రఘువీరారెడ్డి, నామిరెడ్డి సౌజన్య, జడ్పీటీసీ సిలువేరు సిద్ధప్ప, ఎంపీపీ తలారి కీర్తనాకిషన్, మాజీ సర్పంచ్లు పడిగన్నగారి మల్లేశం, గొల్లపల్లి కిష్టయ్య(జీకే), మాజీ డైరెక్టర్ ముత్యం నర్సింహులుగౌడ్ పాల్గొన్నారు.