నర్సాపూర్/చిలిపిచెడ్/కొల్చారం/వెల్దుర్తి/కౌడిపల్లి/శివ్వంపేట, నవంబర్ 28: నర్సాపూర్ ఎమ్మెల్యేగా సునీతారెడ్డి గెలుపు పక్కా అని, ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని కొల్చారం మండల బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి గాలి అనిల్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. కొల్చారం మండలంలోని సంగాయిపేటలో మంగళవారం సర్పంచ్ మానస, వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, పుర్ర ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
* సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచేందుకు నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. మంగళవారం కౌడిపల్లి మండలంలో ఎమ్మెల్యే మదన్రెడ్డి ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్వర్రెడ్డి, మాజీ ఎంపీపీ పద్మనర్సింహారెడ్డి, మాజీ సీడీసీ చైర్మన్ దుర్గారెడ్డి తదితరులు ఉన్నారు.
* నర్సాపూర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి కోడలు కీర్తిశ్రీనివాస్రెడ్డి మంగళవారం వెల్దుర్తి మండల కేంద్రంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. సర్పంచ్ భాగ్యమ్మఆంజనేయులు, ఎంపీటీసీ మోహన్రెడ్డి, పలువురు నాయకులతో కలిసి కీర్తిశ్రీనివాస్రెడ్డి గడపగడపకూ తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి సునీతమ్మను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
* శివ్వంపేట మండలంలోని శివ్వంపేట, గోమారం, గూడూ రు, ఏదుల్లాపూర్, దొంతి, చండి, చెన్నాపూర్ తదితర గ్రామాల్లో నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డికి మద్దతుగా కార్తు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. చెన్నాపూర్లో సునీతాలక్ష్మారెడ్డి చిన్నకోడలు రిత్వికరెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బోళ్ల భారతిభిక్షపతి, ఉపసర్పంచ్ ప్రభాకర్రెడ్డి ఉన్నారు.
* నర్సాపూర్ నియోజకవర్గం అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని సోమవారం బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి కోడలు రుత్వికారెడ్డి పేర్కొన్నారు. నర్సాపూర్ మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో ఆమె ఇంటింటికీ తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
* చిలిపిచెడ్ మండలంలోని సోమక్కపేట, చిట్కుల్, గౌతాపూర్, శీలాంపల్లి గ్రామాల్లో మంగళవారం వైస్ ఎంపీపీ విశ్వంభరస్వామి ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు.
* 30 తేదీన (గురువారం) జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి ప్రజలు ఓటుతో బుద్ధిచెప్పాలని చిలిపిచెడ్ మండల ఇన్చార్జీ జడ్పీ కోఅప్షన్ సభ్యుడు మన్సూర్ పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రమైన చిలిపిచెడ్, చండూర్, జగ్గంపేట, గౌతాపూర్ గ్రామాల్లో ఇంటింటికీ ప్రచారంలో మన్సూర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
* కొల్చారం మండలంలో నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతారెడ్డికి మద్దతుగా ఆయా గ్రామాల సర్పంచులు, బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం ఇంటింటికీ ప్రచారాన్ని నిర్వహించారు. కారు గుర్తుకే ఎలా ఓటు వేయాలని అభ్యర్థించారు. ఎనగండ్లలో సర్పంచ్ వీరారెడ్డి, ఎంపీపీ మంజుల, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గౌరీశంకర్ గుప్తా, మండల రైతుబంధు సమితి కోఆర్డినేటర్ భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఏటిగడ్డమాందాపూర్లో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు రాజాగౌడ్ ఆధ్వర్యంలో కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. కొల్చారంలో సర్పంచ్ ఉమ రాజాగౌడ్, ఎంపీటీసీ అరుణ కృష్ణాగౌడ్ ప్రచారం నిర్వహించారు. కిష్టాపూర్లో సర్పంచ్ గోదావరి ఆధ్వర్యంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. కొల్చారం మండలం పైతరలో పత్తిచేల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.