మనోహరాబాద్, నవంబర్ 5: గజ్వేల్ నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ గెలుపొందడం ఖాయమని, భారీ మెజార్టీని కేసీఆర్కు అందివ్వాలని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, మాజీ చైర్మన్లు ఎలక్షన్రెడ్డి, భూపతిరెడ్డి అన్నారు. మనోహరాబాద్ మండలం రంగాయిపల్లి, కొనాయిపల్లి (పీటీ), ధర్మరాజుపల్లి, మనోహరాబాద్, కాళ్లకల్ గ్రామాల్లో భారీ బైక్ ర్యాలీ, రోడ్షో, ఇంటింటా ప్రచారాన్ని ఆదివారం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి, కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రతి గ్రామంలో ప్రజలు బీఆర్ఎస్ శ్రేణులకు బ్రహ్మరథం పట్టారు. డప్పుచప్పుళ్లతో, ఆడపడుచులు బోనాలతో సందడి చేశారు. పలుగ్రామాల్లో బైక్ ర్యాలీలు కొనసాగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 60 ఏండ్లు కాంగ్రెస్, బీజేపీ పాలనలో తెలంగాణను ఆగం చేశారని, ఎన్నో కష్టాలు పడ్డామన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను పదేండ్లలో అభివృద్ధి పథంలో నిలిపారని కొనియాడారు. తెలంగాణ పల్లెల్లో తాగడానికి నీళ్లులేక అల్లాడిపోయామని గుర్తు చేశారు.
కేసీఆర్ ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి ఆడపడుచుల నీటి కష్టాలను తీర్చారన్నారు. బోరుబావుల వద్ద కరెంట్ లేక రైతులు పడిన అవస్థలు వర్ణణాతీతమన్నారు. నేడు తెలంగాణ పండించిన పంట దేశానికే అన్నపూర్ణగా మారిందన్నారు. వడ్లు కొనమని కేంద్రం మొండికేస్తే రైతులకు నష్టం కలగకుండా తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. అన్ని సర్వేలు బీఆర్ఎస్ గెలుస్తుందని తేల్చిచెబుతున్నాయన్నారు. ఐదేండ్లకోసారి ఎన్నికల సమయంలో మోస పూరిత మాటలతో ఓట్లు అడుక్కునే వారిని నమ్మొద్దని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ర్యాకల శేఖర్గౌడ్, మండలాధ్యక్షుడు పురం మహేశ్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు రతన్లాల్, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, రైతు బంధు మండల కో ఆర్డినేటర్ సుధాకర్రెడ్డి, ఎంపీపీ పురం నవనీతారవి ముదిరాజ్, వైస్ ఎంపీపీ విఠల్రెడ్డి, ఎంపీటీసీ లతావెంకట్గౌడ్, సర్పంచ్లు నాగభూషణం, ప్రభావతి నర్సింహులు ముదిరాజ్, మహిపాల్రెడ్డి, ఉప సర్పంచ్లు ధర్మేందర్, వెంకట్, మహేందర్గౌడ్, నాయకులు చంద్రశేఖర్ ముదిరాజ్, పెంటాగౌడ్, ప్రభాకర్రెడ్డి, రాహుల్రెడ్డి, భిక్షపతి, నాగిరెడ్డి, జావిద్పాషా, ఇర్ఫాన్, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.