పటాన్చెరు, ఏప్రిల్ 29: పటాన్చెరు మండలం ఇస్నాపూర్లో మే 8న బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా కేసీఆర్ నిర్వహించనున్న రోడ్షోను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఇస్నాపూర్ చౌరస్తా ప్రాంతాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. పటాన్చెరు నియోజకవర్గంలోని అన్నిగ్రామాలు, మున్సిపాలిటీలు, బల్దియా డివిజన్ల నుంచి పెద్దఎత్తున జనసమీకరణ చేయాలని సూచించారు. కనీవినీ ఎరుగని రీతిలో కేసీఆర్ రోడ్షోను విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభు త్వం ఆరు గ్యారెంటీల అమలులో వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. మెదక్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని, రికార్డు మెజార్టీతో వెంకట్రామిరెడ్డి గెలువబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అమీన్పూర్ ఎంపీపీ దేవానంద్, మాజీ సర్పంచ్లు ఉపేందర్, వెంకట్రెడ్డి, నాయకులు దశరథ్రెడ్డి, వెంకట్రెడ్డి, కుమార్గౌడ్, ప్రభాకర్గుప్త, మేరాజ్ఖాన్, సందీప్, శ్రీనివాస్రెడ్డి, రామకృష్ణ, అబేద్, తులసిగౌడ్ పాల్గొన్నారు.