చౌటకూర్/పుల్కల్, ఏప్రిల్ 16: సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలంలోని సుల్తాన్పూర్ శివారులో మంగళవానం నిర్వమించిన ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయింది. వేలాదిగా జనం తరలిరావడంతో పరిసరాలు గులాబీమయమయ్యాయి. రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు హోరెత్తించాయి.
సభకు కేసీఆర్ రాగానే జై కేసీఆర్.. జై జై కేసీఆర్ అనే నినాదాలు మిన్నంటాయి. కేసీఆర్ సభాస్థలానికి చేరుకోగానే జహీరాబాద్, మెదక్ ఎంపీ అభ్యర్థులు గాలి అనిల్కుమార్, వెంకట్రామిరెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైన తీరును సభాస్థలి వద్ద ఏర్పాటు చేసిన స్క్రీన్ ద్వారా ప్రజలకు అర్థమయ్యేలా మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు చూపించారు. పోలీసులపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయి.
మాజీమంత్రి హరీశ్రావు, మాజీ సభాపతి, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్రెడ్డి, చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్రెడ్డి, మాణిక్రావు, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవరెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల జడ్పీ చైర్పర్సన్లు హేమలతాశేఖర్ గౌడ్, మంజుశ్రీజైపాల్ రెడ్డి, మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, హన్మంత్ షిండే, పద్మాదేవేందర్ రెడ్డి, రసమయి బాలకిషన్, సత్యనారాయణ, మాజీ కార్పొరేషన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవీశ్రీ ప్రసాద్, మఠం భిక్షపతి, నరోత్తం, వంటేరు ప్రతాప్రెడ్డి, జైపాల్రెడ్డి, బుచ్చిరెడ్డి, ఉదయ్బాబూమోహన్, సాయికుమార్, భాస్కర్రెడ్డి, పట్నం మాణిక్యం, శివకుమార్, దేశ్పాండే, బాలయ్య, నరహరరెడ్డి, నారాయణముదిరాజ్, మీనాక్షీసాయికుమార్, సునీతామనోహర్ గౌడ్, శైలజాశివశంకర్, వీరేందర్, ఎంపీటీసీ పట్లోళ్ల మాణిక్రెడ్డి, మాణయ్య, శివకుమార్, విజయ్కుమార్, లక్ష్మీకాంతరెడ్డి, నర్సింహులు, దర్శన్రెడ్డి, మల్లారెడ్డి, పరమేశ్వర్ గౌడ్, మల్లేశం పాల్గొన్నారు.