అందోల్ గులాబీవనంగా మారింది. తండాలు, పల్లెలు, పట్టణాల తోవలన్నీ అందోల్కే దారితీశాయి. మహిళలు, రైతులు, యువకులు, వృద్ధులు ఉత్సాహంగా తరలిరావడంతో గులాబీ జాతర సాగింది. సంగారెడ్డి జిల్లా అందోల్లో సోమవారం సీఎం కేసీఆర్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యిం ది.
సభకు సబ్బండ వర్గాల ప్రజలు వచ్చి బీఆర్ఎస్కు మద్దతు తెలిపారు. సభలో జై తెలంగాణ జై కేసీఆర్ నినాదాలు మార్మోగాయి. కళాకారులు ఆటపాటలతో సందడి చేశారు. మంత్రి హరీశ్రావు, అందోల్ బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతికిరణ్, బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలను ఉత్సాహపరిచారు. బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు జై తెలంగాణ, జై బీఆర్ఎస్ అంటూ నినాదాలతో సభను హోరెత్తించారు.