నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 12 : పాలకుడు ప్రజలను గౌరవించాలి. వారి అవసరాలను గుర్తించాలి. ఆపదలో ఆదుకోవాలి. అంతేగానీ పన్నుల రూపంలో ప్రజలపై భారం పెంచొద్దు. ప్రజల మనసెరిగిన నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్కు మంచి గుర్తింపు ఉంది. దేశ ప్రగతిని మలుపు తిప్పగల మహానాయకుడు సీఎం కేసీఆర్. ఆయన తలపెట్టిన ప్రతికార్యం దైవ సంకల్పంతో విజయవంతమవుతున్నది. పాలనలో తన మార్క్ చూపిస్తూ, ప్రజల అవసరాలకు అనుగుణంగానే పథకాలు రూపొందించి ప్రశంసలు అందుకున్నాడు. ఇలాంటి నాయకుడు దేశ్ కీ నేత కావాలని పేదలు కోరుకుంటున్నారు. దేశాన్ని సైతం ప్రగతిపథంలో నడిపే దిశగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని విస్తరించి భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చ డంతో ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. దేశ ప్రగతి మారాలంటే సీఎం కేసీఆర్ రావాల్సిందేనని ఆకాంక్షిస్తున్నారు.
కారణజన్ముడు సీఎం కేసీఆర్
గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బీహార్, మధ్యప్రదేశ్, బెంగాల్ నుంచి తెలంగాణకు వచ్చి రాజకీయం చెయ్యొచ్చు, నిన్న మొన్న విడిపోయిన ఆంధ్రప్రదేశ్ వాళ్లు కూడా ఇక్కడికొచ్చి రాజకీయం చెయ్యొచ్చు.. మరి తెలంగానోళ్లు కేంద్రంలో రాజకీయం చేస్తానంటే అంత ఉలుకెందుకో..? అవును తెలంగాణ నుంచి ఒక మొనగాడు.. ఒక పోరాటయోధుడు వస్తున్నాడు. ఒక రాష్ర్టాన్ని సాధించి, కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులతో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి, అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన విజనరీ నేత, కారణజన్ముడు సీఎం కేసీఆర్.
– బీరయ్య యాదవ్, రాజకీయ విశ్లేషకుడు (సంగారెడ్డి)
దేశానికి సీఎం కేసీఆర్ సేవలు అవసరం
తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ .. సుపరిపాలన అందిస్తున్నారు సీఎం కేసీఆర్. కొత్త సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, దేశానికే రాష్ర్టాన్ని రోల్మాడల్గా తయారుచేశారు. ఆయన ఆలోచన విధానంతో నవభారత్ నిర్మాణానికి ఎంతో మేలు జరుగుతది. సంక్షేమ సారథిగా టీఆర్ఎస్ (బీఆర్ఎస్)తో దేశంలో మరిన్ని మార్పులు తెస్తాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి ఆయన సేవలు అవసరం.
– కొలన్ బాల్రెడ్డి, మాజీ జడ్పీటీసీ (బొల్లారం)
కార్మికులకు ఎంతో మేలు
సీఎం కేసీఆర్ కార్మికుల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ను విస్తరించి జాతీయస్థాయిలో బీఆర్ఎస్పార్టీ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన భవన నిర్మాణ కార్మికులు సీఎం కేసీఆర్ చేస్తున్న పనులు గురించి రోజూ మాట్లాడుకుంటున్నారు. మహారాష్ట్ర, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ నుంచి చేర్యాల ప్రాంతానికి వచ్చిన కార్మికులు బీఆర్ఎస్ పార్టీని స్వాగతిస్తున్నారు. కేసీఆర్ పాలనలో కార్మిక లోకానికి ఎంతో మేలు జరిగింది. దేశంలోని కార్మికులందరికీ బీఆర్ఎస్ పార్టీతో మరింత న్యాయం జరగడం ఖాయం.
– కుర్రారం బాల్నర్సయ్య, (భవన నిర్మాణ కార్మిక సంఘం మాజీ అధ్యక్షుడు,చేర్యాల)
దేశ రాజకీయాల్లో పెనుమార్పు బీఆర్ఎస్తో దేశానికి మేలు
తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామం. సీఎం కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్తో తెలంగాణకు మేలు జరిగింది. ఇప్పుడు జాతీయ స్థాయిలో బీఆర్ఎస్పార్టీ ఏర్పాటు చేయడం దేశానికి మేలు జరగడం ఖాయం. సీఎం కేసీఆర్ దేశానికి నాయకత్వం వహిస్తే భారతదేశ రూపురేఖలే మారిపోతాయి. తెలంగాణలో టీఆర్ఎస్తో చరిత్ర సృష్టించిన కేసీఆర్ బీఆర్ఎస్తో భారతదేశంలో చరిత్ర సృష్టించడం తథ్యం.
– పుట్ట కనకరాజు, టీఆర్ఎస్(బీఆర్ఎస్) జిల్లా యూత్ నాయకుడు
సీఎం కేసీఆర్ రాజకీయ చాణక్యుడు
సీఎం కేసీఆర్ అపర రాజకీయ చాణక్యుడు. దేశ రాజకీయాలను ప్రభావితం చేయగల బలమైన దక్షిణాది రాష్ట్రాల నేతగా గుర్తింపు పొందాడు. బీఆర్ఎస్తో దేశ రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులు రావడం తథ్యం. తెలంగాణలో అమలవుతున్న అనేక పథకాలు తమ రాష్ర్టాల్లో అమలు చేయాలని వివిధ రాష్ర్టాల ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. పీఎం మోదీని ఢీకొట్టే దమ్ము దేశంలో సీఎం కేసీఆర్కే మాత్రమే ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం అనేది శుభపరిణామం.
– కాలి దుర్గాప్రసాద్, ఎల్ఐసీ ఏజెంట్, కమలాయపల్లి (మద్దూరు)