రామాయంపేట, నవరి 17: కంటివెలుగు శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని విజయవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి రాజేంద్రప్రసాద్, కంటివెలుగు జిల్లా నోడల్ అధికారి డాక్టర్ సుమిత్ర, ఇరిగేషన్శాఖ ఈఈ రాయారావు శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం మండలం డీ. ధర్మారం పీహెచ్సీ, రామాయంపేట పట్టణంలోని ఒకటో వార్డులో నిర్వహించే కంటివెలుగు శిబిరాలను సందర్శించి సిబ్బందితో మాక్ డ్రిల్ నిర్వహించారు. నేడు ప్రారంభించే కంటి వెలుగు కార్యక్రమాన్ని సిబ్బంది అధికారులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో రామాయంపేట ఎంపీడీవో, ఉమాదేవి, ఎంపీవో, గిరిజారాణి, గ్రామ స ర్పంచ్ శంకర్, డాక్టర్లు హరిప్రియ, సాగర్ ఉన్నారు.
కంటివెలుగును సద్వినియోగం చేసుకోవాలి
నిజాంపేట, జనవరి 17: దృష్టి లోపాల నివారణయే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తం గా ప్రారంభించనున్న కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఇన్చార్జి డీపీవో రాజేంద్రప్రసాద్ అన్నా రు. మంగళవారం ఆయన నందిగామలోని కంటివెలుగు సెంటర్ను సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. సెంటర్కు వచ్చే వారికి నీడ తో పాటు నీళ్ల సదుపాయం కల్పించాలని సిబ్బందికి సూ చించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటలక్ష్మీ, ఎంపీ వో రాజేందర్, ఎంపీటీసీ సురేశ్, కార్యదర్శి ఆరిఫ్హుస్సే న్, ఏఎన్ఎం సలోమి, ఆశవర్కర్ గౌరి ఉన్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి
మెదక్ మున్సిపాలిటీ, జనవరి 17: రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి జిల్లా కేంద్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో 32వార్డుల్లో వార్డుకో శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మెదక్లో వార్డు ల్లో ఎమ్మెల్యే ప్రారంభిస్తారన్నారు. కంటి వెలుగులో భాగం గా కంటి సమస్యలు ఉన్న వారిని పరిక్షించడంతో పాటు వారికి అవసరమైన కంటి అద్దాలను ఉచితంగా అందజేస్తుందన్నారు. ప్రజలు ఆధార్ కార్డు తీఆసుకోని కేంద్రాలకు రావాలన్నారు.
విజయవంతం చేయండి
నర్సాపూర్, జనవరి 17 : నేటి నుంచి గ్రామగ్రామాన ప్రారంభమవుతున్న రెండో విడుత కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మదన్రెడ్డి, రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అంధత్వ నివారణ కోసం కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకొచ్చి అనేక మంది ప్రజలకు కంటి చూపును ప్రసాదించాడని వెల్లడించారు. కంటి వెలుగు కార్యక్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుం డా తగిన చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్ పేర్కొన్నారు.
కంటి వెలుగుతో జీవితాల్లో వెలుగు
చేగుంట, జనవరి 17: నేటి నుంచి ప్రారంభం కానున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమంపై నార్సింగి ప్రా థమిక ఆరోగ్యకేంద్రం డాక్టర్ రవికుమార్ నార్సింగి మండ లంలోని సంకాపూర్ గిరిజన తండాలో మంగళవారం గ్రామ ప్రజలకు అవగాహన కల్పించి, కంటి వెలుగు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ అవకాశాన్ని అందరూ సద్విని యోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పం చ్ భూలక్ష్మి, ఏఎన్ంలు, ఆశకార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
పేదల కళ్లల్లో వెలుగులు
వెల్దుర్తి, జనవరి 17: సీఎం కేసీఆర్ ఎంతోమంది నిరుపేదల కండ్లలో వెలుగులు నింపనున్నారని ఎంపీపీ స్వరూపనరేందర్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెల్దుర్తితో పాటు మండలంలోని మన్నెవారి జలాల్పూర్లో రేపటి నుంచి ప్రారంభం అవుతుందన్నారు. కంటివెలుగు బృందాలకు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలన్నారు.
శిబిరం ఏర్పాట్ల పరిశీలన
పెద్దశంకరంపేట, జనవరి 17: నేటి నుంచి ప్రారంభమయ్యే కంటి వెలుగు శిబిరం ఏర్పాట్లను స్థానిక ఎంపీడీ వో రఫీకున్నీసా, వైద్యాధికారి సారిక మంగళవారం పెద్దశంకరంపేటలో కంటి వెలుగు శిబిరాన్ని ఎంపీడీవో పరిశీలించారు. పెద్దశంకరంపేట బస్టాండ్ సమీపంలో పాత గ్రామపంచాయతీ కార్యాలయంలో కంటి వెలుగు వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామని వాటి ఏర్పాట్లను పరిశీలిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ వీణా సుభాశ్గౌడ్, ఈవో వెంకట్రాములు, వైద్య సిబ్బంది ఉన్నారు.