కంటి వెలుగు శిబిరాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. మంగళవారం మెదక్ కలెక్టర్ రాజర్షి షా హవేళీఘనపూర్లో ఏర్పాటుచేసిన సెంటర్ను పరిశీలించి వివరాలు తెలుసుకుని, సిబ్బందికి సలహాలు, సూచనలు చేశారు. చేగుంట మండలం చిన్నశివునూర్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించి, పరీక్షలు చేయించుకున్న వారికి కళ్లద్దాలు అందజేశారు. కంటి వెలుగు రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ స్వరాజ్య లక్ష్మి సంగారెడ్డి, కంది మండలాల్లో కేంద్రాలను పరిశీలించి, రికార్డులు తనిఖీ చేశారు.
చేగుంట, ఫిబ్రవరి 28: దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ పేదల సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, కంటి వెలుగు కార్యక్రమం దేశానికే స్ఫూర్తిగా నిలుస్తుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ అన్నారు. చేగుంట మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం లభ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, ప్రభుత్వ స్థలంలో నివసిస్తున్న పలువురి లబ్ధిదారులకు జీవో నంబర్ 58 సర్టిఫికెట్లను వారు స్థానిక ఎమ్మెల్యే రఘునందన్రావుతో కలిసి అందజేశారు. అనంతరం మండల పరిధిలోని చిన్నశివునూర్లో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి, పరీక్షలు చేయించుకుని అవసరమైన వాకి ఎంపీ, ఎమ్మెల్సీ కంటి అద్దాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమానికి అనేక పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ధనిక, పేద తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమున్న వారికి కంటి అద్దాలు, మందులు అందజేయడమే కాకుండా ఆపరేషన్ల కోసం పెద్ద దవాఖానలకు రెఫర్ చేస్తున్నారని వివరించారు. ఆడబిడ్డలకు మేన మామలా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని అమలు చేస్తూ ఆడబిడ్డలు ఉన్న తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్నారు. నిరుపేదల ఇండ్లకు జీవో 58, 59 పట్టాలను అందజేస్తున్నారన్నారు. ఈ పట్టా సర్టిఫికెట్ల పంపిణీని త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా నుంచి ప్రారంభించనున్నారని తెలిపారు. అలాగే ఖాళీ స్థలాలు ఉండి ఇల్లు నిర్మించుకునే వారికి రూ.3 లక్షలు ప్రభుత్వం అందజేయనున్నదని చెప్పారు. కార్యక్రమంలో చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ రజనక్ ప్రవీణ్ కుమార్, జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, సర్పంచ్ కొటారి అశోక్, ఉప సర్పంచ్ స్వామి, ఎంపీటీసీలు అయిత వెంకటలక్ష్మి, మెతుకు శ్రీనివాస్, చేగుంట తహసీల్దార్ లక్ష్మణ్బాబు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యులు డాక్టర్ అనిల్కుమార్, ఆశ కార్యకర్తలు, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
మైనార్టీ భవన నిర్మాణానికి శంకుస్థాపన
నార్సింగి మండల కేంద్రంలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ మంగళవారం మైనార్టీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం రైతు వేదికలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ చిందం సబిత, జడ్పీటీసీ బాణపురం కృష్ణారెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అశోక్, రాజేశ్, శంకర్గౌడ్, ఎంపీటీసీలు సత్యనారాయణ, సుజాత, తహసీల్దార్ సత్యనారాయణ తదితరులున్నారు.