కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి రైతుబంధు, పంట రుణమాఫీని అడ్డుకుని రైతుల కడుపు కొట్టారని ఎమ్మెల్యే మదన్రెడ్డి, నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి విమర్శించారు. మంగళవారం నర్సాపూర్ మండలంలోని సీతారాంపూర్, రుస్తుంపేట్, ఆవంచ, రాంచంద్రాపూర్, తుల్జారాంపేట్, ఎల్లాపూర్, మాడాపూర్, గూడెంగడ్డ, కాగజ్మద్దూర్, నత్నాయిపల్లి, కొండాపూర్ గ్రామాల్లో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 10 హెచ్పీ మోటర్ పెట్టుకోవడం సాధ్యపడుతుందా అని రేవంత్రెడ్డిని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న భూములకు ఎసరు పెట్టేందుకు భూమాతను తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారని, రైతులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నర్సాపూర్, నవంబర్ 21: ఎన్నికలను ఎదుర్కొనే సత్తాలేక కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి రైతుబంధు, రుణమాఫీని అడ్డుకుని రైతుల కడుపుకొట్టారని ఎమ్మెల్యే మదన్రెడ్డి, నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం మండలంలోని సీతారాంపూర్, రుస్తుంపేట్, ఆవంచ, రాంచంద్రాపూర్, తుల్జారాంపేట్, ఎల్లాపూర్, మాడాపూర్, గూడెంగడ్డ, కాగజ్మద్దూర్, నత్నాయిపల్లి, కొండాపూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే మదన్రెడ్డితో కలిసి బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రచారానికి ప్రజలు, పార్టీ శ్రేణులు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాక ముందు రాష్ట్రం ఎట్లా ఉండే ఇప్పుడెట్లా ఉందో బేరీజు వేసుకుని ఓట్లు వేయాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో సరిగ్గా కరెంట్ లేక మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు తరుచూ కాలిపోయేవని గుర్తుచేశారు.
ఒకప్పటి తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఉండేవని, నేడు ఆత్మహత్యల్లేని రాష్ట్రంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చిదిద్దారన్నారు. రైతులు సుఖసంతోషాలతో ఉండాలని సీఎం కేసీఆర్ రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్ తదితర పథకాలు తీసుకొచ్చారన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా గ్రామగ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి చివరి గింజ వరకూ కొంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే రైలు బండీకి ఎదురెళ్లడమేనని, అంటే రిస్క్ తీసుకోవడమేనని ఆయన సూచించారు. రేవంత్రెడ్డి మూడు గంటల కరెంట్ ఇస్తానని అంటున్నాడని, దీంతో రైతులకు ఎంత నష్టం జరుగుతుందో తెలుసుకోవాలన్నారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం మోటర్ల వద్ద మీటర్లు పెడితే రూ.10 వేల కోట్లు ఇస్తామని చెప్పినా సీఎం కేసీఆర్ వినలేదని, ఎన్ని కోట్లిచ్చినా మీటర్లు పెట్టనివ్వనని తెగేసిచెప్పారని గుర్తుచేశారు. గ్రామాల్లో మిషన్ భగీరథ ద్వారా నీరు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, సీసీ రోడ్లు తదితర పనులు చేయించారన్నారు. కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు.
10 హెచ్పీ మోటర్లతో వ్యవసాయం చేయడం సాధ్యమేనా రేవంత్రెడ్డి.. అని నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని ప్రశ్నించారు. ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ రేవంత్రెడ్డికి వ్యవసాయం మీద పూర్తి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నాడని వెల్లడించారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని నమ్మిన వ్యక్తి కేసీఆర్ అని, కేసీఆర్ రైతుల పక్షపాతి అని అన్నారు. మహిళల సంక్షేమం కోసం ఆరోగ్యమహిళ, ఆరోగ్యలక్ష్మీ, న్యూట్రీషన్ కిట్ తదితర పథకాలు తీసుకొచ్చారన్నారు. ఒకప్పుడు మహిళలు తాగునీటి కోసం తిప్పలు పడ్డారని, నేడు మిషన్ భగీరథతో అరుగు బయటే నీళ్లు పట్టుకుంటున్నారని అన్నా రు. కులం, మతం, వర్గం అనే తేడా లేకుండా సీఎం కేసీఆర్ అందరికీ సంక్షేమ ఫలాలు అందించారన్నారు. యాదవులకు గొర్రెలు పంపిణీ చేసి వారి ఆర్థికాభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేయూతనందించిందన్నారు. మత్స్యకారులకు చేపలు, వాహనాలు, బీసీబంధు, దళితబంధు తదితర పథకాలు అందించారన్నారు. రూ.25 వేల కోట్ల రుణమాఫీకి రూ.23 వేల కోట్ల అందించారని, కాంగ్రెస్, బీజేపీ అడ్డుకోవడంతో కొంతమందికి సాధ్యపడలేదని, అధికారంలోకి రాగానే అందరికీ రుణమాఫీ అందజేస్తామన్నారు.
బీసీలకు అన్యాయం చేసిన వారే నేడు బీసీ నినాదంతో మన ముందుకు వస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ నాయకుడు సింగాయిపల్లి గోపి తెలిపారు. గతంలో బీసీలకు ఏమి చేశారో ప్రజలకు వివరించాలని బీజేపీ అభ్యర్థిని ప్రశ్నించారు. పదవుల్లో ఉన్నప్పటికీ బీజేపీ అభ్యర్థి బీసీలకు ఎలాంటి సహాయం చేయలేదని విమర్శించారు. మాసాయిపేట్ మండలంలో బీసీ రైతుల భూములను గుంజుకున్న వ్యక్తి ఈటల రాజేందర్ అని విమర్శించారు. అన్ని కులాల వారు బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉన్నారని, సునీతాలక్ష్మారెడ్డి గెలువడం ఖాయమన్నారు. ప్రచారంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పైడి శ్రీధర్గుప్తా, నాయకులు సంతోష్రెడ్డి, సత్యంగౌడ్, హబీబ్ఖాన్, బీఆర్ఎస్కేవీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరి వీరేశం, పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, ఎంపీటీసీ సంధ్యాఛత్రునాయక్, మేఘమాల కిషన్, మాజీ ఎంపీపీ లలితానర్సింగ్, సర్పంచ్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.