సంగారెడ్డి కలెక్టరేట్, జూలై31: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారం భం కానున్నాయి. సంగారెడ్డి జిల్లాలో 26 పరీక్షా కేంద్రా లు ఏర్పాటు చేశారు. ఇందులో 13,306 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మొదటి సంవత్సరం 9,109 మంది, ద్వితీయ సంవత్సరం 4,197 మంది పరీక్షలకు హాజరుకానున్నారని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి గోవింద్రామ్ తెలిపారు. నేటి నుంచి 10వ తేదీ వరకు నిర్వహించే పరీక్షలకు అవసరమైన సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. 26 పరీక్షా కేంద్రాలకు 26 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 26 మంది డిపార్ట్మెంట్ అధికారులు, 665 మంది ఇన్విజిలేటర్లు, 9మంది ఏసీఎస్లతో పాటు ఫ్లైయింగ్ స్కాడ్ బృందాలను నియమించినట్లు అధికారులు తెలిపారు. 17 కేంద్రాలు ప్రభుత్వ, 9 కేంద్రాలు ప్రైవేటు కళాశాలల్లో ఏర్పాటు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. సీసీ కెమెరాల నిఘాలోనే ప్రశ్నా పత్రాలు ఓపెన్ చేయనున్నట్లు తెలిపారు.
మెదక్లో..
నేటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు సర్వ సిద్ధం చేశారు. నేటి నుంచి 8వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు ప్రథమ, ద్వితీయ సంవత్స రం, వొకేషనల్ విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గం టల వరకు నిర్వహించనున్నారు. మొత్తం 6628 మంది పరీక్షలు రాయనున్నారు. ప్రథమ సంవత్సరంలో 4383 మంది, ద్వితీ య సంవత్సరంలో 2245 మంది పరీక్షలకు హాజరుకానున్నా రు. ఇందుకు జిల్లాలో 24 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. 24 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 24 మంది డిపార్ట్మెం ట్ అధికారులు ఒక ఫ్లయింగ్ స్కాడ్ బృందంతో పాటు సిట్టింగ్ స్కాడ్ బృందాలు ఏర్పాటు చేశారు. హాల్ టికెట్లను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవడానికి ఇంటర్ బోర్డు అవకాశం కల్పించింది. పరీక్షా కేంద్రాలకు అరగంట ముందు నుంచే అనుమతించనున్నారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.
నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశాం. నిమిషయం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించం. ఒక గంట ముందుగానే విద్యార్థులు తమ పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబడవు.
– గోవింద్రామ్, సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ అధికారి
పకడ్బందీగా నిర్వహణ
పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం. సిబ్బంది నియామకాలు పూర్తి చేసి అవగాహన కల్పించాం. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలి. ఎలాంటి సమస్యలు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు తీసుకున్నాం.
– సత్యనారాయణ, మెదక్ జిల్లా ఇంటర్ నోడల్ అధికారి
పదో తరగతి అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు
పదో తరగతి విద్యార్థులకు నేటి నుంచి 6వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. మెదక్ జిల్లాలో 746 మంది పరీక్షలు రాయనున్నారు. ఇందుకు మెదక్, నర్సాపూర్, తూప్రాన్లో ఒక్కొక్కటి చొప్పున పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.