తూప్రాన్/మనోహరాబాద్, డిసెంబర్ 6: అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ అన్నా రు. మంగళవారం తూప్రాన్, మనోహరాబాద్ల్లో పలు అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. తూప్రాన్ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద చివరి దశలో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అక్కడ వి ద్యుత్ స్తంభాలు, మీటర్ల సమస్యలను గుర్తించి సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే సమస్యను పరిష్కరించారు. మనోహరాబాద్ మండలంలోని ముప్పిరెడ్డిలో టీఎస్ఐఐసీకి భూములు అప్పగించిన రైతులకు ఇండ్ల స్థలాలు అందజేసేందుకు గుర్తించిన స్థలంలో హద్దులు ఏర్పాటు చేసి రోడ్లు వేయుటకు గాను ఈ నెల 20లోగా లే అవుట్ప్లాన్ రూపొందించవలసిందిగా అధికారులను ఆదేశించారు. అనంతరం కూచారం గ్రామంలో పర్యాటకానికి అనుకూలంగా ఉండే ప్రదేశాన్ని గుర్తించారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ అనురాధ, ఆర్డీవో సాయిరాం, తహసీల్దార్లు, ఆర్ఐ జయభారత్రెడ్డి పాల్గొన్నారు.
త్వరితగతిన పూర్తి చేయాలి
చేగుంట, డిసెంబర్ 6: డబుల్ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ సంబంధిత పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం చేగుంటలోని చివరి దశలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. జనవరి 15నాటికి నిర్మాణం చివరి దశలో ఉన్న ఇండ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, అందుకు అనుగుణంగా పనులు వేగవంతం చేస్తూ కాలనీకి అవసరం ఉన్న మౌలిక వసతులను కల్పించాలని అధికారులకు సూచించారు.