పెద్దశంకరంపేట శివారులో నిర్మించిన 100 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. చివరిదశలో కొనసాగుతున్న పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. రేపు మంత్రి హరీశ్రావు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించనున్నారని, ఈ లోగా పనులన్నీ పూర్తవ్వలన్నారు.
ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీటి నల్లాలు, కరెంట్ మీటర్లు బిగించాలని ఆర్డబ్ల్యూస్, విద్యుత్ శాఖలకు సూచించారు. ఈ సందర్భంగా రైతువేదికలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమక్షంలో డ్రా పద్ధతిలో లబ్ధిదారులను మెదక్ ఆర్డీవో అంబదాస్ రాజేశ్వర్ ఎంపిక చేశారు.
-పెద్దశంకరంపేట, సెప్టెంబర్ 17
పెద్దశంకరంపేట, సెప్టెంబర్17: పెద్దశంకరంపేట పట్టణ శివారులో నూతనంగా నిర్మించిన సుమారు 100 డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి అన్ని పనులను వెంటనే పూర్తి చేసి పంపిణీకి సిద్ధం చేయాలని కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. ఆదివారం పట్టణ శివారులో నిర్మించిన డబుల్ బెడ్రూ ం ఇండ్ల వద్ద కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ఈ నెల 19న ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను అందజేస్తారన్నారు.
రేయింబవళ్లు పని చేసి అన్ని పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. అన్ని ఇండ్లకు మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఇవ్వాలని ఆర్డబ్ల్యూస్ అధికారులకు ఆదేశించారు. ప్రతి ఇంటికీ కరెంట్ మీటర్ బిగించాలని విద్యుత్ శాఖ ఏఈకి సూచించారు. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని పీఆర్ అధికారులకు సూచించారు. మంత్రి సభకు ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్య లు తీసుకోవాలన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ఎలా జరిగిందని ఆర్డీవో అంబదాస్ రాజేశ్వర్కు అడిగి తెలుసుకున్నారు. ఇల్లు వచ్చిన వారు తమ గృహాలను మామిడి తోరణాలు, పూలతో అలంకరించుకోవాలని సూచించారు.
లబ్ధిదారుల ఎంపికకు డ్రా
పెద్దశంకరంపేటలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం గృహాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికను రైతు వేదికలో అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారుల సమక్షంలో మెదక్ ఆర్డీవో అంబదాస్ రాజేశ్వర్ డ్రా తీశారు. డ్రాలో వచ్చిన నంబర్ల ఆధారంగా లబ్ధిదారులకు ఇల్లు కేటాయించారు. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి, రెండో అంతస్తులోని ఇండ్లను సైతం డ్రా పద్ధతిలో లబ్ధిదారులకు కేటాయించారు. ఎంపీపీ జంగం శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీపంతులు, వైస్ ఎంపీపీ లక్ష్మీరమేశ్, తహసీల్దార్ గ్రేసీబాయి, ఎంపీడీవో రఫీకున్నీసా, ఆర్ఐ శరనప్ప, సర్పంచ్ అలుగుల సత్యనారాయణ, ఎంపీటీసీ వీణా సుబాశ్గౌడ్, పీఆర్ డీఈ శ్రీనివాస్, నాయకులు వేణుగోపాల్గౌడ్, ఆర్ఎన్ సంతోష్కుమార్ ఉన్నారు.