నిజాంపేట,జూలై6 : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి చేరిక అవుతున్నారని మొదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్లో ఎమ్మెల్యేసమక్షంలో కల్వకుంట ఉపసర్పంచ్తో పాటు 7 మంది కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు,15 మంది కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కల్వకుంట పీఏసీఎస్ చైర్మన్ అందె కొండల్రెడ్డి, వైస్ ఎంపీపీ అందె ఇందిర, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు మావురం రాజు, పీఏసీఎస్ డైరెక్టర్ అబ్దుల్ఆజీజ్, నందిగామ, నార్లపూర్ మాజీ సర్పంచులు స్వామి, నర్సింహులు, రామాయంపేట ఏఎంసీ డైరెక్టర్ రవి, టీఆర్ఎస్ నాయకులు రాములు, స్వామి, నగేశ్ తదితరులు ఉన్నారు.