జహీరాబాద్, జనవరి 7: సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని స్వప్న(17) కళాశాల ఉన్న డార్మెంటరీ గదిలో ఫ్యాన్కు ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉపాధ్యాయులు, విద్యార్థినులు, పోలీసుల కథనం ప్రకారం .. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థిని స్వప్న ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసి చదువుకునేందుకు పుస్తకాల కోసం డార్మెటరీ గదికి వెళ్లింది. డార్మెటరీ గదికి వెళ్లిన విద్యార్థిని స్వప్న ఫ్యాన్కు చున్నీతో ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన తోటి విద్యార్థినులు విషయాన్ని ఉపాధ్యాయులకు తెలిపారు. వెంటనే విద్యార్థిని జహీరాబాద్ సర్కా రు దవాఖానకు తరలించారు.
విద్యార్థిని పరిశీలించిన వైద్యులు మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతురాలు స్వప్న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం తూంకుంట గ్రామానికి చెందిన బ్యాగరి రాజు, వనజ దంపతుల కుమార్తె. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వి ద్యార్థిని స్వప్న మృతిచెందిన విషయం తెలుసుకున్న జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు వెంటనే పాఠశాలకు చేరుకొని మృతిపై వివరాలు తెలుసుకునేందుకు పాఠశాల లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గేట్ ఎదుట విద్యార్థినుల తల్లిదండ్రులతో కలిసి ఆందోళనకు దిగారు. విద్యార్థిని మృతిపై విచారణ జరిపి, న్యా యం చేయాలని ఆయన డిమాండ్ చేశా రు. ఆత్మహత్యకు గల కారమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జహీరాబాద్ ఆర్డీవో వెంకారెడ్డి తెలిపారు. విద్యార్థిని కుటుంబాన్ని ఆదుకోవాలని, కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని ఆయన తెలిపారు.