సిద్దిపేట, మే3: రైతు బీమా మాదిరిగా రాష్ట్రంలో కల్లు గీత కార్మికుల కోసం గీతన్నకు బీమా అమలు చేయడంపై తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు, సర్వాయి పాపన్న గౌడ్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె బాలకిషన్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం సిద్దిపేట పట్టణంలోని పాపన్నగౌడ్ చౌరస్తాలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్లు గీస్తూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గీత కార్మికుడి కుటుంబానికి ప్రభుత్వం నేరుగా రూ.5లక్షల బీమాఅందించేందుకు చర్యలు తీసుకోవడం హర్షణీయమన్నారు. గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి యాదగిరిగౌడ్, గీత కార్మిక యూనియన్ అధ్యక్షుడు ముండ్రాతి రాజు, నాయకులు శ్రీనివాస్గౌడ్, రామంచ మల్లేశంగౌడ్, అయిలయ్య, బాలరాజుగౌడ్, బొల్లం అంజయ్య, మహేశ్గౌడ్, బాలకిషన్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.
ధూళిమిట్టలో…
మద్దూరు(ధూళిమిట్ట), మే 3 : గౌడ కులస్తులకు గీతన్న బీమా కల్పిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంపై ధూళిమిట్ట మండల కేంద్రంలో బుధవారం గౌడ సంఘం సభ్యులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గీతన్నబీమా కల్పించేందుకు చర్యలు తీసుకోవడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ దుబ్బుడు దీపికావేణుగోపాల్రెడ్డి, ఉపసర్పంచ్ లింగం, గౌడ సంఘం అధ్యక్షుడు తాళ్లపల్లి కనకయ్య, కొల నర్సింహులు, బీఆర్ఎస్వై అధ్యక్షుడు బడుగు సాయిలు, సత్తయ్య, విజయ్కుమార్, శ్రీనివాస్, లింగం, రాములు, అశోక్, చంద్రయ్య, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.