మెదక్ మున్సిపాలిటీ, మే 8 : జిల్లా కేంద్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 8 నుంచి 20 వార్డుల్లో పట్టణ ప్రగతి నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. కోటి 51 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేని విధంగా వినూత్మకంగా చేపట్టిన పట్టణ, పల్లె ప్రగతితో పట్టణాలు, పల్లెలు సుందరంగా మారుతున్నాయన్నారు. ప్రతి మున్సిపాలిటీకి పట్టణ ప్రగతి ద్వారా ప్రతి నెలా ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తుందని ఆమె పేర్కొన్నారు.
పట్టణంలో ఇప్పటికే విశాలమైన మెయిన్ రోడ్డు వేసుకున్నాం. అంతేగాకుండా పట్టణంలోని అంతర్గ రోడ్లతోపాటు ఆయా వార్డులలో కాలానీలు, వీధుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నామన్నారు. పట్టణాల్లో పచ్చదనం, పరిశుభ్రతను పెంచాలని పాలకవర్గానికి సూచించారు. పట్టణం ఆహ్లదకరమైన వాతవారణం పొందేలా ముందుకెళ్దామన్నారు.
రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ పేదవర్గాల అభ్యున్నతికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, కౌన్సిలర్లు విశ్వం, ఆర్కె శ్రీనివాస్, కిషోర్, మాజీ ఎఎంసీ చైర్మన్ మధుసూధన్రావు, తదితరులు పాల్గొన్నారు.