మెదక్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): మెదక్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ రానున్న సీఎం ప్రజా ఆశీర్వాద సభకు మెదక్ జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ గ్రౌండ్లో సుమారు 10 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం సీఎస్ఐ గ్రౌండ్లో సీఎం సభా స్థలిని మెదక్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు నందు జనార్దన్రెడ్డి, లింగారెడ్డి, రాగి అశోక్, జుబేర్ తదితరులు పరిశీలించారు.
అనంతరం కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం ఆశీర్వాద సభలో 50 వేల మంది ప్రజలు కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సభ వద్ద జర్నలిస్టులు, మహిళలు, పురుషులు వేర్వేరుగా కూర్చునేలా బారికేడ్లను ఏర్పాట్లు చేస్తామన్నారు. సభకు వచ్చే ప్రజల వాహనాల రాకపోకలతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పారింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు మెదక్ నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరానున్నారన్నారు. మూడోసారి సీఎం కేసీఆర్, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి గెలిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావిస్తున్నారన్నారు.
సీఎస్ఐ గ్రౌండ్లో ఏర్పాటు చేస్తున్న సభా స్థలి సమీపంలోనే హెలిప్యాడ్ను ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం ఎల్లారెడ్డిలో సీఎం సభ ముగించుకుని నేరుగా మెదక్ జిల్లా కేంద్రంలోని సభా స్థలికి చేరుకుంటారు. అకడ మెదక్ నియోజకవర్గానికి చెందిన నేతలు సీఎం కేసీఆర్కు స్వా గతం పలుకుతారు. అనంతరం వేదికపైకి కేసీఆర్ చేరుకుంటారు.