గజ్వేల్ రూరల్, డిసెంబర్ 6 : గజ్వేల్కు రైలు మార్గం రావాలనేది ఎన్నో ఏండ్ల ఇక్కడి ప్రజల కల. ప్రభుత్వాలు మారుతున్నా రైలు కూతపై పార్లమెంట్లో మాత్రం అనుకూల ప్రకటన రాలేదు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ పట్టుదలతో గజ్వేల్కు రైలును తీసుకొచ్చారు. రైలు మార్గం సుగమం కాగానే గజ్వేల్లో రేక్ పాయిం ట్ ఏర్పాటు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశాలతో అధికారులు చర్యలు చేపట్టడంతో నేడు గజ్వేల్ కేంద్రం గా రేక్ పాయింట్ ఏర్పాటైంది. దీంతో ఉమ్మడి జిల్లా రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుం ది. నిరంతరం ఎరువులు అందుబాటులో ఉండడంతో రైతులకు సమస్య తీరడంతో పాటు సీజన్ రాగానే ఎరువులు అందుబాటులోకి వస్తున్నాయి. రేక్ పాయింట్పై ప్రభుత్వం తీసుకున్న కృషితో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గజ్వేల్కు రైలు మార్గం అందుబాటులోకి రావడంతో ఇక్కడ కొత్తగా రేక్ పాయింట్ ఏర్పాటు చేయడం ఎరువుల కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపినట్లయింది. సీజన్ వచ్చిందంటే రైతులు ఎరువులు, విత్తనాల కోసం పరుగులు తీసేవారు. ఇక అలాంటి సమస్య రాకుండా ప్రభుత్వం రేక్ పాయింట్ను ఏర్పాటు చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాకు అవసరం మేరకు అందుబాటులో ఎరువులను సిద్ధంగా ఉంచుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఎరువుల దుకాణాలకు ఇక్కడి నుంచి సరఫరా చేసే వెసలుబాటు కలుగుతుంది.
గజ్వేల్ నుంచి ఎరువుల సరఫరా..
ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు హైదరాబాద్ నుంచి ఎరువులు సరఫరా అయ్యేవి. కానీ, నేడు గజ్వేల్ రేక్ పాయింట్ నుంచి వివిధ ప్రాంతాలకు ఎరువులు సరఫరా అవుతాయి. హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు ఎరువులు సరఫరా అయ్యే సమయంలో అనేక సమస్యలు ఉత్పన్నం అయ్యేవి. కానీ, నేడు అలాంటి సమస్యలను అధిగమించి రైతుల కోసం ప్రభు త్వం తీసుకున్న నిర్ణయంతో ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఉమ్మడి జిల్లాతో పాటు యాదాద్రిభువనగిరి జిల్లాలకు కూడా ఎరువులకు సరఫరా ఇక్కడి నుంచి చేస్తున్నారు.
వానకాలం ప్రారంభంలో జూన్ 27న మంత్రులు తన్నీరు హరీశ్రావు, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి రేక్పాయింట్ను ప్రారంభించారు. ఇప్పటి వరకు గజ్వేల్ పాయింట్కు 13,551 మెట్రిక్ టన్నుల ఎరువులు రాగా, అందులో 2575 మెట్రిక్ టన్నుల 20:20:0:13, యూరియా 10,794 మెట్రిక్ టన్నులు, 182 మెట్రిక్ టన్నుల డీఏపీ ఎరువులు వచ్చాయి. ఇక్కడి నుంచి ఎరువులను రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సకాలంలో వివిధ ప్రాంతాలకు తరలించింది. త్వరలోనే ఈ సీజన్కు అవసరమయ్యే ఎరువులను రేక్ పాయిట్ ద్వారా సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
గజ్వేల్లో 20వేల మెట్రిక్ టన్నుల
నిల్వలకు అవకాశం..
గజ్వేల్లో ఏర్పాటు చేసిన రేక్ పాయింట్ ద్వారా 20వేల మెట్రిక్ టన్నుల ఎరువులను నిల్వ చేసేందుకు వీలు ఉంది. తద్వారా రైతులకు ఎలాంటి ఎరువుల సమస్య ఉండదు. రైతులకు అవసరమయ్యే ఎరువులు సకాలంలో అందించే వీలుంటుంది. ఎరువుల తయారీ కంపెనీల నుంచి నేరుగా గూడ్స్ రైళ్ల ద్వారా ఎరువులు గజ్వేల్కు చేరుకుంటాయి. ఇక్కడి నిల్వ చేసిన తర్వాత జిల్లాలో అవసరమైన ప్రాంతాలకు లారీల ద్వారా తరలించే అవకాశం ఉంటుంది. సీఎం కేసీఆర్, మంత్రి తన్నీరు హరీశ్రావు కృషి ఫలితంగా రైతులకు మంచి రోజులొచ్చాయి.
సీఎం కేసీఆర్ కృషి మరిచిపోలేనిది
సీఎం కేసీఆర్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చేస్తున్న కృషి మరిచిపోలేనిది. కలలో కూడా ఊహించని అభివృద్ధి గజ్వేల్ ప్రాంతంలో చేసి రైతుల కలను సాకారం చేసిన మహనీయుడు. ఎరువులను రేక్ పాయింట్లో నిల్వ చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు కృషితో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-మాదాసు శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్, గజ్వేల్
రైతు శ్రేయస్సుకు ప్రభుత్వం కృషి
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ నిరంతరం రైతు ల శ్రేయస్సు కోసమే తపిస్తున్నారు. రైతుల ప్రయోజనాలను దృ ష్టిలో ఉంచుకొని అనేక కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు. ఏటా సీజన్లో ఎరువుల కోసం బారులు తీరే రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు. రేక్ పాయింట్తో అనేక జిల్లాల రైతులకు ఎరువులు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రైతులు ఎంతో సంతోషం ఉన్నారు.
-దేవీరవీందర్, రైతుబంధు సమితి రాష్ట్ర కమిటీ సభ్యుడు