కంగ్టి, మే 9 : గ్రామాలకు సుదూరంగా ఉంటూ జీవనాన్ని కొనసాగించే గిరిజనుల పాలిట గురుకుల పాఠశాలలు వరం లా మారాయి. ఏటా వలస వెళ్లేటప్పుడు తమపిల్లలను సైతం సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లేవారు. దీంతో వారి చదువు అర్థంతరంగా నిలిచిపోయేది. దీంతో నిరక్ష్యరాస్యులుగా మారి తమ తల్లిదండ్రుల మాదిరిగా సంవత్సరం లో నాల్గు నెలల పాటు దూర ప్రాంతాలకు వలస వెళ్లడం పరిపాటిగా మారింది.
గిరిజన పిల్లలు సైతం ఉన్నత చదవులు చదవాలనే ఉద్దేశంతో గత సంవత్సరం టీఆర్ ఎస్ ప్రభుత్వం అన్ని మండలాలకు గురుకుల పాఠశాలను మంజూరు చేసిం ది. కంగ్టి ప్రాంతంలో గిరిజన తండాలు అధికంగా ఉన్నాయ నే ఉద్దేశంతో కంగ్టిలో గతేడాది గిరిజన గురుకుల బాలుర పాఠశాలను మంజూరు చేశారు. అదే సంవత్సరం పాఠశాల తరగతులను ప్రారంభించారు. కంగ్టిలోని ప్రైవేట్ భవనంలో గురుకుల పాఠశాల కొనసాగుతున్నది. గత సంవత్సరం 5,6 తరగతులు మాత్రమే ప్రారంభమవ్వగా గత వార్షిక సంవత్సరంలో 7వ తరగతి ప్రారంభమవ్వగా ఈ ఏడాది 8వ తర గతిని ప్రారంభించారు.
పూర్తియిన పాఠశాల భవన నిర్మాణ పనులు
గిరిజన గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి ప్రభుత్వం గతేడాది రూ. 4.20కోట్ల నిధులను మంజూరు చేసింది. కంగ్టిలో భీంరా రోడ్డులో భవన నిర్మాణాలు పూర్తియ్యాయి. వచ్చే వార్షిక సంవత్సరం నుంచి విద్యా ర్థులు నూతన భవనంలో చదువుకోనున్నారు. మూడు సంవత్సరాలు ఈ పాఠశాలలకు నారాయణ ఖేడ్లో కొనసాగగా ఈ ఏడాది నుంచి కంగ్టిలోని నూతన భవనానికి మారనుంది. ప్రస్తుతం రంగు లు, ప్లంబింగ్, ఎలక్ట్రిక్ పనులు కొనసాగగా రానున్న రెండుమూడు నెలల్లో పూర్తిస్థాయిలో పనులు పూర్తవుతాయని సం బంధిత అధికారులు పేర్కొంటున్నారు. ప్రైవేట్కు దీటుగా గిరిజన గురుకుల పాఠశాలను నిర్మించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రస్థాయిలో ప్రతిభ
కంగ్టికి చెందిన గురుకుల పాఠశాల విద్యార్థులు ఇటీవల గురుకుల పాఠశాలల వారు రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ఒకరు మొదటి స్థానాన్ని గెలుపొందగా మరొకరు రన్నరఫ్గా నిలిచారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో నిర్వహించిన పోటీల్లో పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సచిన్ కుస్తీ పోటీల్లో మొదటి బహుమానాన్ని గెలుపొందారు. అదే విధంగా అదే తరగతికి చెందిన కిరణ్ చదరంగంలో రన్నరఫ్గా నిలిచారు. పాఠశాలకు చెందిన 8వ తరగతికి చెం దిన విద్యార్థి అశోక్ ఢిల్లీలో నిర్వహించిన మాలకంబ్ పోటీల్లో జాతీయ స్థాయిలో పాల్గొన్నారు. ప్రతి రోజు ఉదయం, సా యంత్రం వేళల్లో గంటపాటు విద్యార్థులకు ఇష్టమైన క్రీడల ను అధ్యాపకులు ఆడిపిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం గతేడాది రూ. 50వేలతో ఆట సామగ్రిని పాఠశాలకు అందజేసింది. వీటితో వాలీబాల్, క్రికెట్, బ్యాట్మింటన్, షటిల్, క్యారం, చదరంగం, స్కిప్పింగ్ త్రో ఆట వస్తువులు కొనుగోలు చేసి ప్రతిరోజూ ఆడిపిస్తున్నారు.
కార్పొరేట్ తరహాలో విద్యా బోధన
పట్టణ ప్రాంతాల్లో కార్పొరేట్ విద్యా సంస్థలు ఏ మాదిరిగా విద్యనందిస్తారో అదే విధంగా గురుకులాల్లో సైతం చదువు కొనసాగుతున్నది. కంగ్టి గిరిజన గురుకుల పాఠశాలలో 5నుంచి 10వ తరగతి వరకు కొనసా గుతుంది. ప్రతి తరగతిలో 40కి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక విధానం కొనసాగగా స్థానిక నియోజకవర్గ విద్యార్థులతో పాటు సుదూర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు సైతం ఇక్క డ చదువుకుంటున్నారు. వీరికి ప్రతిరోజు ఇంగ్లిష్ మీడియంలో బోధించగా పౌష్టికాహారంతో కూడిన భోజనాన్ని అందిస్తున్నారు. కాంగ్రెస్ హయంలో సంక్షే మ హాస్టల్లో ముక్కిపోయిన బియ్యంతో భోజనాన్ని అందించగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి విద్యార్థికి సన్నబియ్యంతో కూడిన భోజనాన్ని అందించాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. దీం తో మూడు సంవత్సరాల నుంచి సన్నబియ్యంతో భో జనం అందిస్తున్నారు. అదే విధంగా గురుకులాల్లో ప్రతిరోజు ఉదయం అల్పహా రం, మధ్యాహ్నం ప్రత్యేక భోజనం, రాత్రి భోజనాన్ని పోషకాలతో కూడిన భోజనాన్ని పెడుతున్నారు. వారానికి రెండుసార్లు మాంసాహారాన్ని అందించగా ప్రతిరోజు గుడ్డును అందిస్తున్నా రు. చదువులో సైతం ప్రత్యే క శ్రద్ధ కనబరుస్తున్నారు. ప్రతి రోజు ఉదయం ప్రార్థనతో ప్రారంభమ య్యే పాఠశాలలో మొత్తం ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తున్నారు.