HomeMedakGroundwater Levels Rising In Precedent With Mission Kakatiya
చెరువులు ఫుల్
చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. విస్తారంగా కురిసిన వర్షాలతో పాటు మిషన్కాకతీయ కింద అభివృద్ధి చేయడంతో జలకళను సంతరించుకున్నాయి. వానకాలం సీజన్ వ్యవసాయ పనులు జోరందుకున్న క్రమంలో సాగునీటికి ఢోకా లేదని, ఈ ఏడాది రెండు పంటలు పండించుకోవచ్చని అధికారులు అంటున్నారు.
వర్షాలతో నిండుకుండల్లా చెరువులు
మిషన్ కాకతీయతో పూర్వవైభవం
పెరుగుతున్న భూగర్భ జలమట్టాలు
వ్యవసాయానికి పుష్కలంగా సాగునీరు
ఆనందంలో అన్నదాతలు
వానకాలం సాగుపనుల్లో బిజీబిజీ
పెరగనున్న పంటల విస్తీర్ణం
మత్స్యకారుల వలల్లో పెద్దఎత్తున చేపలు
చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. విస్తారంగా కురిసిన వర్షాలతో పాటు మిషన్కాకతీయ కింద అభివృద్ధి చేయడంతో జలకళను సంతరించుకున్నాయి. వానకాలం సీజన్ వ్యవసాయ పనులు జోరందుకున్న క్రమంలో సాగునీటికి ఢోకా లేదని, ఈ ఏడాది రెండు పంటలు పండించుకోవచ్చని అధికారులు అంటున్నారు. భూగర్భ జలమట్టాలు సైతం పెరిగాయి. బోరుబావులు, బావుల్లో నీళ్లు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 1600 చెరువులు ఉండగా, 422 మత్తడి దుంకుతున్నాయి. 246 పూర్తిస్థాయిలో నిండాయి. 523 చెరువుల్లో 75శాతం నీటి నిల్వలు ఉన్నాయి. జూన్తో పోలిస్తే జూలైలో భూగర్భజలమట్టాలు 1.76 మీటర్ల పైకి వచ్చాయి.
-మెదక్ /సంగారెడ్డి (నమస్తే తెలంగాణ), ఆగస్టు 10
ఇటీవల విస్తారంగా కురిసిన వర్షాలకు సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో చెరువులు జలకళను సంతరించుకున్నాయి. దీంతోపాటు జిల్లాల్లోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, వాగులు, వంకల్లో సమృద్ధిగా నీరు వచ్చి చేరింది. సింగూరు, నల్లవాగు, మంజీరా తదితర ప్రాజెక్టులు జలవనరులతో నిండుకుండలను తలపిస్తున్నాయి. చెరువులు, ప్రాజెక్టులు నిండుతుండడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలో మొత్తం 2632 చెరువులున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో 2411 చెరువులు పూర్తి స్థాయిలో నిండాయి. 221 చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో 1600 చెరువులు ఉన్నాయి. వీటిలో 422 చెరువులు మత్తడి దుంకుతున్నాయి. 246 చెరువులు నీటితో నిండుగా ఉన్నాయి.
సంగారెడ్డి జిల్లాలో ..
సంగారెడ్డి ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో ఇటీవల విస్తారంగా కురిసన వర్షాలకు చెరువులు జలకళను సంతరించుకున్నాయి. దీంతో జిల్లాలోని చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లోకి సమృద్ధిగా నీరు వచ్చి చేరింది. సింగూరు, నల్లవాగు ప్రాజెక్టులు సహా జలవనరులు నిండుకుండలను తలపిస్తున్నాయి. సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం 27.672 టీఎంసీలు ఉన్నాయి. నల్లవాగు, నారింజ ప్రాజెక్టులు మత్తడి దుంకుతున్నాయి. ప్రాజెక్టులకు తోడు జిల్లాలోని చెరువులు, కుంటలు నీటితో నిండుగా మారాయి. దీంతో ఆయకట్టు రైతుల సాగు నీటి కష్టాలు తీరిపోయాయి.
పుష్కలంగా సాగు నీరు
సంగారెడ్డి జిల్లాలో 1600 చెరువుల్లో 422 మత్తడి దుంకుతున్నాయి. 246 చెరువులు నీటితో పూర్తిగా నిండుగా ఉన్నా యి. దీంతో ఆయకట్టు కింద సాగు చేసిన రైతులకు సాగు నీరు పుష్కలంగా అందనున్నది. దీంతో భూగర్భ జలమట్టా లు పెరగనున్నాయి. బోరు బావుల్లో పుష్కలంగా నీళ్లు వస్తున్నాయి. దీంతో రైతులకు సాగు నీరు, ప్రజలకు తాగు నీరు పుష్కలంగా లభించనున్నాయి.
మత్తడి దూకుతున్న 422 చెరువులు
జూలై ఆరంభం నుంచి జిల్లాలో వర్షాలు కురవడంతో 20 రోజుల్లో జలవనరులు నిండుకుండలా మారాయి. సింగూ రు, నల్లవాగు, నారింజ ప్రాజెక్టులతో పాటు చెరువులు జలకళను సంతరించుకున్నాయి. సంగారెడ్డి ఇరిగేషన్ డివిజన్ పరిధిలో 399 చెరువులు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి. సంగారెడ్డిలోని మహబూబ్సాగర్ చెరువు, కంది పెద్ద చెరువు, అందోల్లోని అన్నసాగర్ చెరువుతోపాటు 399 చెరువులు అలుగు పారుతున్నాయి. జహీరాబాద్ డివిజన్లో 16 చెరువులు, నారాయణఖేడ్ డివిజన్లో 7 చెరువులు మత్తడి దుంకుతున్నాయి.
పెరిగిన భూగర్భ జలమట్టం
జిల్లాలోని చెరవులు, కుంటలు నిండటం, ప్రాజెక్టుల్లో నీరు చేరింది. దీంతో భూగర్భ జలమట్టాలు భారీగా పెరిగాయి. జిల్లాలో మొత్తం 1600ల్లో 246 చెరువులు నిండుగా ఉన్నాయి. 523 చెరువులు 75 శాతం నిండాయి. దీంతో చెరువుల కింద ఉన్న ఆయకట్టుకు సాగునీరు అందుతున్నది. ఈ చెరువుల పరిధిలో 1,36,896 ఎకరాల ఆయకట్టు ఉంది. జిల్లాలో సాధారణ భూగర్భ జలమట్టాలు 10.41 మీటర్లకు చేరుకున్నాయి. జూన్లో సాధారణ జలమట్టాలు 11.89 మీటర్లు ఉండగా జూలై చివరి నాటికి 10.41 మీటర్లకు చేరుకున్నది. జూన్తో పోలిస్తే జూలైలో 1.76 మీటర్ల పైకి భూగర్భ జలమట్టాలు పైకి వచ్చాయి. ప్రస్తుతం చెరువులు నిండుగా మారడంతో లక్ష ఎకరాలకు సాగు నీరు అందుబాటులోకి వస్తున్నది. దీంతో ఆయకట్టు రైతుల్లో సంతోషం వ్యక్తం అవుతుంది.
సంగారెడ్డి జిల్లాలోని మండలాల్లో భూగర్భ జలమట్టాలు
అమీన్పూర్ మండలంలో 1.21 మీటర్ల లోతునే భూగ ర్భ జలమట్టాలు ఉన్నాయి. హత్నూర మండలంలో 18.32 మీటర్ల లోతులో భూగర్భ జలాలున్నాయి. వట్పల్లిలో 1.25 మీటర్లు, నాగల్గిద్ద 3.69, పుల్కల్ 4.29, అందోల్ 4.91, మనూరు 5.07, రాయికోడ్ 5.10, మునిపల్లి 6.17, నారాయణఖేడ్ 7.12, న్యాల్కల్ 7.55, సిర్గాపూర్ 8.87 మీట్లర్ల లోతులో భూగర్భ జలమట్టాలు ఉన్నా యి. మిగితా మండలాల్లో 9 నుంచి 17 మీటర్లలోపు భూగ ర్భ జలమట్టాలున్నాయి.