తొలకరి వర్షాలతో వ్యవసాయ పనుల్లో అన్నదాతలు బిజీ
రైతులకు అందుబాటులో విత్తనాలు, ఎరువులు
మెదక్ జిల్లాలో 3,31,280 ఎకరాల్లో వివిధ పంటల సాగుకు అవకాశం
వానకాలం సీజన్ ముగిసే వరకు సరఫరా
ప్రస్తుతం యూరియా 9035..
కాంప్లెక్స్ ఎరువులు 3182 మెట్రిక్ టన్నుల నిల్వలు
సొసైటీల్లో ద్వారా పంపిణీ
ఎక్కడా కొరత రాకుండా అధికారుల చర్యలు
వానకాలం సాగు పనులు జోరందుకున్నాయి. తొలకరి వానలు కురుస్తుండడంతో అన్నదాతలు దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉంచింది. డిమాండ్కు తగ్గట్లు యూరియా, డీఏపీ, పొటాష్, ఎస్ఎస్పీ, కాంప్లెక్స్ తదితర ఎరువులను ఎప్పటికప్పుడు తెప్పించేలా ప్రణాళికలు రూపొందించింది. మొత్తం 93వేల 600 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉండగా, యూరియా 9035 మెట్రిక్ టన్నులు, డీఏపీ 569, కాంప్లెక్స్ ఎరువులు 3182, ఎంవోపీ 120, ఎస్ఎస్పీ 116 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.
మెదక్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): వానకాలం సాగు కు ఎరువులు, విత్తనాలను జిల్లా యంత్రాంగం సిద్ధం చేశా రు. రైతులకు ఎలాంటి కొరత లేకుండా అన్నింటిని అందుబాటులో ఉంచారు. ఆయా దశల్లో పంట సీజన్ మొత్తం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. యూరియా, డీఏపీ, పొటాష్, ఎస్ఎస్పీ, కాంప్లెక్స్ తదితర ఎరువులను ఎప్పటికప్పుడు తెప్పించేలా ప్రణాళికలు రూ పొందించారు. ప్రస్తుతానికి అవసరమైన ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్న ట్టు అధికారులు వెల్లడిస్తున్నారు.
తొలకరి వర్షాలతో సాగు పనులు
జిల్లాలో తొలకరి వర్షాలు కురవడమే ఆలస్యం రైతన్నలు పొలం పనుల్లో బిజీగా ఉన్నారు. దుక్కులు దున్నడంతో పాటు పత్తి సాగు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విత్తనాలు, ఎరువులను సమకూర్చుకునే పనిలో పడ్డారు. ఇటీవల కాలంలో భూసారంపై ప్రభావం చూపుతున్న పొటాష్ను తగ్గించి యూ రియా, డీఏపీ వంటి ఎరువులను రైతులు ఎక్కువగా వాడుతున్నారు.
3,31,280 ఎకరాల్లో సాగు
మెదక్ జిల్లాలో ఈ సీజన్లో 3,31,280 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయనున్నట్లు వ్యవసాయాధికారులు తెలుపుతున్నారు. ఇందులో ప్రధానంగా 1,75 లక్షల ఎకరాల్లో వరి, 92వేల ఎకరాల్లో పత్తి సాగు చేయనున్నట్లు అంచనా. కంది 21వేల ఎకరాలు, మొక్కజొన్న 19వేల ఎకరాలు, జొన్నలు 3వేల ఎకరాలు, మినుములు 3వేల ఎకరాలు, పెసర 4వేల ఎకరాలు, 9వేల ఎకరాలు ఇతర పంటలు సాగు చేయనున్నట్లు అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
సొసైటీల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ
జిల్లాలో 3,31,280 ఎకరాలకు అవసరమున్న ఎరువులు, విత్తనాలను సొసైటీల ద్వారా సరఫరా చేస్తున్నా రు. మొత్తం 93 వేల 600 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉండనున్నాయి. వీటిలో యూరియా 39 వేల మెట్రిక్ టన్నులు కాగా అందులో 9వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. ఇందులో యూరి యా 9035 మెట్రిక్ టన్నులు, డీఏపీ 569 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 3182 మెట్రిక్ టన్ను లు, ఎంవోపీ 120 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 116 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. కాగా డీఏపీ 7600 మెట్రిక్ టన్నులకు 569 మెట్రిక్ టన్ను లు, కాంప్లెక్స్ 34,200 మెట్రిక్ టన్నులకు 31,353 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 8500 మెట్రిక్ టన్నులకు 8370 మెట్రిక్ టన్నులు కావాలని ప్రతిపాదనలు పం పారు. ఎస్ఎస్పీ 4500 మెట్రిక్ టన్నులకు 4228 మెట్రిక్ టన్నులు అవసరం కానున్నాయి. 43,750 క్వింటాళ్ల వరి విత్తనాలతో పాటు ఇతర పంటల విత్తనా లు అవసరం కానున్నాయని అంచనా వేశారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
అందుబాటులో ఎరువులు
వానకాలం సీజన్కు సంబంధించి ఎరువులను అందుబాటులో ఉంచాం. 93వేల మెట్రి క్ టన్నుల ఎరువులు అవస రం కానున్నాయి. ఇప్పటికే 9035 మెట్రిక్ టన్నుల యూ రియా, 569 మెట్రిక్ టన్నుల డీఏపీ నిల్వ ఉంది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తు న్నాం. ఎరువులు, విత్తనాలు సొసైటీలతో పాటు ఫర్టిలైజర్ దుకాణాల్లో విక్రయించేలా చూస్తున్నాం.
– పరశురాం నాయక్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, మెదక్