దుబ్బాక, జనవరి 13 : గ్రామ పంచాయతీలకు మహర్దశ పట్టింది. పరిపాలనా సౌలభ్యంతో పాటు మారుమూల పల్లెల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నూతన పంచాయతీలు ఏర్పాటు చేశారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందిస్తూ బీఆర్ఎస్ సర్కారు ప్రజారంజక పాలన కొనసాగిస్తున్నది. నూతనంగా ఏర్పాటైన పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించేందుకు పక్కా భవనాల నిర్మాణానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించింది. అరకొర వసతులు, అద్దె భవనాలు, శిథిలావస్థలో కొనసాగుతున్న పంచాయతీలకు పక్కా భవనాలు మంజూరు చేసింది. అధునాతన హంగులతో పంచాయతీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
ఎంజీఎన్ఆర్ఈజీఎస్ (మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం)లో 40శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిలో భాగంగా పక్కా భవనాల కోసం ఖర్చుచేస్తున్నది. ఇందులో భాగంగా పంచాయతీలకు పక్కా భవనాలు నిర్మిం చి గ్రామీణ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు దృష్టి సారించింది. ఇటీవల రాష్ట్రంలో పం చాయతీ భవనాలకు నిధులు కేటాయించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. జిల్లాలో నూత న పంచాయతీలతోపాటు పంచాయతీ భవనాలు లేని గ్రామాలకు పక్కా భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించింది. జిల్లాలో మొత్తం 69 పంచాయతీ భవనాలకు నిధులు మంజూరయ్యా యి. ఒక్కో పంచాయతీ భవనానికి రూ.20 లక్షల చొప్పున 69 పంచాయతీలకు రూ.13.80కోట్లు మంజూరయ్యాయి. పంచాయతీ లకు పక్కా భవనాలు మంజూరు కావడంతో గ్రామాల్లో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు, చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి సంబురాలు జరుపుకొంటున్నారు.
గ్రామాలకు సముచిత న్యాయం
సీఎం కేసీఆర్ పాలనలో గ్రామీణ ప్రాంతాలు బలోపేతమయ్యాయి. గాంధీజీ కన్న గ్రామ స్వరా జ్యం సీఎం కేసీఆర్ పాలనలో నెరవేరింది. కుల వృత్తులకు ఆదరణతో పాటు రైతులకు అండగా ఉంటూ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది. వ్యవసాయానికి సాగునీరు, ఉచిత కరెంట్తోపాటు పంట పెట్టుబడి కోసం రైతుబంధు, రైతు కుటుంబాలకు ఆసరాగా రైతు బీమా పథకం అండగా నిలుస్తున్నాయి. గొల్లకురుమలకు ఉచితంగా గొర్రెలు, రజక, నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. అర్హులైన వృద్ధులకు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, గీత, నేత కార్మికులందరికీ ఆసరా పింఛన్లు, ఆడబిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం, సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్యసేవలు అం దుతున్నాయి. పల్లెలు అభివృద్ధి బాటలో నిలిపేందుకు పంచాయతీలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది.
జిల్లాలో 69 పంచాయతీలకు పక్కా భవనాలు
జిల్లాలో నూతనంగా ఏర్పాటైన పంచాయతీలతో పాటు అద్దె భవనాల్లో ఉన్న పంచాయతీలకు పక్కా భవనాలు మంజూరు చేసింది. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్శాఖ ఆధ్వర్యంలో గత డిసెంబర్ 12న రాష్ట్రంలో పంచాయతీ భవనాలకు నిధులు కేటాయించింది. జిల్లాలో 72 పంచాయతీల పక్కా భవనాలకు రూ.13.80 కోట్లు మంజూరయ్యాయి.
పంచాయతీల వివరాలు
జిల్లాలో అత్యధికంగా దుబ్బాక నియోజకవర్గానికి పంచాయతీ భవనాలు మం జూరు కావడం విశేషం. జిల్లాకు 60 పంచాయతీ భవనాలు మంజూరు కాగా, ఇం దులో దుబ్బాక నియోజకవర్గానికి 22 పం చాయతీ భవనాలు మంజూరయ్యాయి.
దుబ్బాకలో 22 భవనాలు
దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక మండలంలో 10 పంచాయతీలు, మిరుదొడ్డి మండలంలో 5, రాయపోల్ మండలంలో 3, దౌల్తాబాద్ మండలంలో 2, తొగుట మండలంలో 2 మొత్తం 22 పంచాయతీ భవనాలు.
జనగామ (చేర్యాల) 19 పంచాయతీలకు..
చేర్యాలలో 5, ధూళిమిట్ట మండలంలో 3, కొమురవెల్లి మండలంలో 4, మద్దూరులో 1, మానకొండూరులోని బెజ్జంకి మండలంలో 6 పంచాయతీ భవనాలు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో 17 పంచాయతీ భవనాలు
హుస్నాబాద్ మండలంలో 2, అక్కనపేటకు 8, కోహెడ మండలంలో 7 పంచాయతీలకు పక్కా భవనాలు మంజూరయ్యాయి.
సిద్దిపేట నియోజకవర్గంలో 11 పంచాయతీలకు భవనాలు
సిద్దిపేట నియోజకవర్గంలో సిద్దిపేట రూరల్లో 4, అర్బన్లో 2 పంచాయతీలకు, చిన్నకోడూరు మండలంలో 3, నంగునూరు మండలంలో 2 పంచాయతీలకు భవనాలు మంజూరయ్యాయి.
మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డికి కృతజ్ఞతలు
సీఎం కేసీఆర్ సక్కారులో పంచాయతీలకు సముచిత న్యాయం చేకూరింది. గ్రామాభివృద్ధితోపాటు పేదలకు సంక్షేమ పథకాలు అం దడం సంతోషంగా ఉంది. చాలా ఏండ్లుగా శిథిలావస్థలో ఉన్న పంచాయతీ భవనాల్లో ప్రజలకు సేవలందించడం కష్టంగా ఉండేది. మా గ్రామంలో సుమారు 50 ఏండ్ల కింద నిర్మించిన చిన్నపాటి పంచాయతీ భవనంలో గ్రామసభ, ఇతర సమావేశాలు నిర్వహిస్తున్నాం. మా పంచాయతీకి పక్కా భవనం మంజూరు కావడం సంతోషంగా ఉంది. మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు.
– సద్ది రాజిరెడ్డి, సర్పంచ్, పెద్దగుండవెల్లి (సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు)
తాత్కాలికంగా పాల కేంద్రంలోనే పంచాయతీ భవనం
గ్రామంలో పంచాయతీ భవనం లేకపోవడంతో తాత్కాలికంగా పాలకేంద్రం భవనంలో పంచాయతీ భవనం కొనసాగుతుంది. పాలకేంద్రంలో పరిపాలన కార్యకలాపాలు నిర్వహించడం సమస్యగా ఉం టుంది. ఎంపీ ప్రభాకర్రెడ్డి ప్రత్యేక చొరవతో మా గ్రామానికి పంచాయతీ భవనం మంజూరైంది. ఇందుకు ఆయనకు మా గ్రామస్తుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు.
– దొందడి లక్ష్మీనర్సారెడ్డి, సర్పంచ్, గోసాన్పల్లి