మెదక్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ) : ఆకలిగొన్న వాడికి అన్నం పెట్టాలన్నదే సేవాలాల్ ప్రబోధన అని, ఆయన గొప్ప సంసరణవాదని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి, కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అన్నారు. బుధవారం బంజారా గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ 284వ జయంతి సందర్భంగా ద్వారకా నగర్లో బంజార భవన్ కోసం కేటాయించిన స్థలంలో కార్యక్రమాన్ని అధికారికంగా ఏర్పాటు చేశారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యా రెడ్డి, గిరిజన నాయకులతో కలిసి సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ చందు నాయక్, డీఈవో రమేశ్, ఆర్డీవో సాయి రాం, జిల్లా పరిశ్రమల అధికారి కృష్ణమూర్తి, డీఎస్పీ సైదులు, కార్యక్రమ కన్వీనర్, జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజ్, కౌన్సిలర్లు, సర్పంచ్లు పాల్గొన్నారు.
సంగారెడ్డిలో..
సంగారెడ్డి, ఫిబ్రవరి 15: గిరిజనులకు ఆరాధ్యడుగా సన్మార్గాన్ని చూపించిన సంత్ సేవాలాల్ మహరాజ్ 284వ జయంతిని అధికారికంగా జరుపుకోవడం సంతోషకరమని సంగారెడ్డి కలెక్టర్ శరత్కుమార్ నాయక్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని గణేశ్నగర్ సేవాలాల్ ఆలయం బాబానగర్లోని సేవాలాల్ మహరాజ్ మందిరం వరకు గిరిజన సంఘాలు, విద్యార్థులతో భ్యారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కలెక్టర్ శరత్కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు గణేశ్నగర్ ఆలయంలోని బోగ్ బండార్లో కలెక్టర్, జడ్పీచైర్పర్సన్లు పాల్గొన్నారు. వారితో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, గిరిజన సంక్షేమాధికారి, వ్యవసాయ జిల్లా అధికారి నర్సింహరావు, జడ్పీటీసీ రాజు రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.
గిరిజనులను చైతన్యపర్చిన మహనీయుడు సేవాలాల్
నారాయణఖేడ్, ఫిబ్రవరి 15: గిరిజనులను చైతన్యపర్చి, హైంద వ ధర్మం గొప్పదనాన్ని చాటిచెప్పిన మహనీయుడు సంత్ సేవాలాల్ మహరాజ్ అని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. సేవాలాల్ జయంతిని పురస్కరించుకుని నారాయణఖేడ్లోని ఎంబీఆర్ కాలనీలో ఉన్న భవానీమాత ఆలయంలో డీపీవో సురేశ్ మోహన్తో కలిసి భోగ్బండార్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ లక్ష్మీబాయి రవీందర్నాయక్, బంజారా సేవాలాల్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్చౌహాన్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సత్యపాల్రెడ్డి, ఎంపీడీవో వెంకటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గిరిజనులు సేవాలాల్ను ఆదర్శంగా తీసుకోవాలి
జహీరాబాద్, ఫిబ్రవరి 15: సంత్ సేవాలాల్ను ఆదర్శంగా తీసుకోవాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు తెలిపారు. పట్టణంలోని బజారా భవనంలో సేవాలాల్ మహరాజ్ జయంతిలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, గోవింద్ మహరాజ్, జడ్పీ సీఇవో ఎల్లయ్య, ఆత్మ కమిటీ చైర్మన్ పెంటారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కిషన్ పవార్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు విజయ్మోహన్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సయ్యద్ మోయినోద్దిన్, నాయకులు తన్వీర్, మోతీరాం, శ్రీనివాస్నాయక్, వాస్నాయక్, హీర్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
గొప్ప స్ఫూర్తి ప్రదాత సేవాలాల్ మహరాజ్
రామచంద్రాపురం, ఫిబ్రవరి15: గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ గొప్ప స్ఫూర్తి ప్రదాత అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా తెల్లాపూర్ మున్సిపాలిటీలోని విద్యుత్నగర్లో సేవాలాల్ మహరాజ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రూ.57 లక్షలతో నిర్మించిన బంజారా భవన్ను ప్రారంభించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో గిరిజనులు ఆర్థికంగా, సామాజికంగా అభ్యున్నతి సాధిస్తున్నారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సాత్విక బోధనలు అందించిన ఆదర్శప్రాయుడు
రామయంపేట/ చేగుంట ఫిబ్రవరి 15: సమాజానికి సాత్విక బోధనలు అందించి, ప్రజలను మేల్కొల్పిన ఆదర్శ ప్రాయుడు సంత్ సేవాలాల్ మహరాజ్ అని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. చేగుంట, నార్సింగి మండలాల్లో సేవాలాల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్ గిరిజనులకు ప్రత్యేక నిధులు కేటాయించిందని ఎంపీ అన్నారు. కార్యక్రమంలో చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జడ్పీటీసీ ముదం శ్రీనివాస్, మంచికట్ల శ్రీనివాస్, రఘురాములు, గాండ్ల లతానందం, అయిత వెంకటలక్ష్మి, హలావత్ స్వాతి, గణేశ్, అంచనూరి రాజేశ్ తదితరులు ఉన్నారు.
బీఆర్ఎస్ హయాంలోనే గిరిజనుల అభివృద్ధి
నర్సాపూర్, ఫిబ్రవరి15: బీఆర్ఎస్ హయాంలోనే గిరిజనుల అభివృద్ధి జరిగిందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. పట్టణంలో సంత్ సేవాలాల్ మమరాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి సేవాలాల్ ఆలయం వరకు ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ దేవేందర్రెడ్డి, నాయకులు పైడి శ్రీధర్గుప్తా, డీటీడబ్ల్యూవో కేశురాంనాయక్, ఎంపీపీ జ్యోతిసురేశ్నాయక్, కౌన్సిలర్ అశోక్గౌడ్, జడ్పీటీసీ బాబ్యానాయక్, గిరిజన నాయకుడు రమేశ్నాయక్, ఎంఈవో బుచ్చానాయక్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ పాల్గొన్నారు.
బంజారాల కోసం పరితపించిన వ్యక్తి సేవాలాల్
బంజారాల అభివృద్ధికి పరితపిం చిన వ్యక్తి సేవాలాల్ అని సంగా రెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, కలెక్టర్ శరత్కుమార్ నాయక్ అన్నారు. గిరిజనుల ఆరాధ్యుడు సంత్ సేవాలాల్ జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం గొప్ప విషయమన్నారు. గిరిజనులకు గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసి మెరుగైన విద్య అందిస్తున్నదన్నారు. జిల్లా కేంద్రంలో న్యాయవిద్యను అందించాలనే సంకల్పంతో న్యాయ కళాశాలను ప్రారంభించిందన్నారు. సేవాలాల్ కలలుగన్న గిజనుల అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపిస్తున్నారని గుర్తుచేశారు.
సేవాలాల్ మార్గంలో నడవాలి
అందరికీ రామ్ రామ్.. సేవాలాల్ ప్రబోధించినట్లు సన్మార్గంలో నడవండి. సేవ చేయండి. వారి స్ఫూర్తితో సమాజంలో గౌరవంగా బతుకుతూ మానవ జన్మకు సార్థకత తీసుకురండి.గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్ కల్పించింది. గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి చకటి విద్యాబోధన అందిస్తున్నది. ప్రతిఒకరూ చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. తెలంగాణ ఉద్యమంలో బంజారాలు కదం తొకారు. వారి ఆత్మ గౌరవాన్ని కాపాడేలా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్లో బంజారా భవన్ నిర్మించారు. ఉద్యమ సమయంలో భూక్యా తండాలో రాత్రి బస చేసినప్పుడు అగ్నిప్రమాదంలో పెండ్లి కోసం దాచుకున్న డబ్బులు కోల్పోయి, దికుతోచని పరిస్థితిలో ఉన్న కల్పన దీనావస్థ చూసి, వచ్చిన ఆలోచనే కల్యాణలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. బంజారా భవన నిర్మాణానికి కృషి చేస్తాం.
– పద్మా దేవేందర్రెడ్డి, ఎమ్మెల్యే, మెదక్
అందుబాటులోకి అనేక సేవలు
ప్రభుత్వం ప్రతి తండాను పంచాయతీ చేయడంతో ఎన్నో సేవలు అందుబాటులోకి వచ్చాయి. మెదక్ జిల్లాలో 38 తండాలకు త్వరలో కొత్త భవనాలు నిర్మించనున్నాం. తెలంగాణ వచ్చాక గురుకుల పాఠశాలల సంఖ్య రెట్టింపు కావడంతో పాటు చకటి విద్యా బోధన జరుగుతున్నది. సౌకర్యాలు మెరుగయ్యాయి. పిల్లలు చదువుపై దృష్టి కేంద్రీకరించి బాగా చదువుకుని జీవితం లో ఉన్నతంగా ఎదగాలి. చదువుతోనే సమాజంలో గౌరవం వస్తుంది. గిరిజన జాతి కష్టపడే మనస్తత్వం కలది. 25 ఏండ్లు కష్టపడితే ఆ తరువాత కాలం సంతోషంగా గడపవచ్చు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలు వినియోగించుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలి. అన్ని రంగాల్లో గిరిజనలు అభివృద్ధి సాధించాలి.
– రాజర్షి షా, కలెక్టర్, మెదక్
తండాల్లో స్వపరిపాలన
మీ తండాల్లో మీ పాలన తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దే. గ్రామ పంచాయతీల ఏర్పాటుతో మీకు ఆ అవకాశం దకింది. సీఎం కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడం ద్వారా పలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. దేశంలో మొట్టమొదటగా అధికారికంగా సేవాలాల్ జయంతిని మన తెలంగాణ రాష్ట్రంలోనే జరుపుకొంటున్నాం. ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా వినియోగించుకోవడంలో గిరిజనులే ముందున్నారు. గురుకుల పాఠశాల ద్వారా ప్రభుత్వం చకటి విద్య నందిస్తున్నది. గిరిజన విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయిలో ఉండాలి. తండాలలో నీళ్ల కోసం బిందెలు పట్టుకుని కిలోమీటర్ల దూరం వెళ్తున్న ఆడపడుచుల దీనస్థితిని చూసి మిషన్ భగీరథ నీళ్లు అందిస్తున్నారు. పూరి గుడిసెలో నివసిస్తూ సొంత జాగా కలిగిన వారికి త్వరలో ఇండ్ల నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించనున్నాం. బంజారా భవన నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తా.
– శేరి సుభాశ్రెడ్డి, ఎమ్మెల్సీ