పెద్దశంకరంపేట,ఆగస్టు04 : ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. గురువారం నారాయణఖేడ్ క్యాంపు కార్యాలయంలో ముగ్గురు లబ్ధిదారులకు సీఎం రిలీప్ఫండ్ చెక్కులను అందజేశారు.
పెద్దశంకరంపేట మండలపరిధిలోని మల్కాపురం గ్రామానికి చెందిన భూపాల్కు రూ.28 వేలు, గొట్టిముక్కుల గ్రామానికి చెందిన కె.విఠల్గౌడ్కు రూ.40 వేలు, నీరుడు శ్రీనివాస్కు రూ.15 వేలు చొప్పున మంజూరైన సీఎం సహయనిధి చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ భూత్కూరి విజయరామరాజు, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బోండ్ల దత్తు, మండల రైతుబంధు అధ్యక్షుడు సురేష్గౌడ్, సర్పంచ్ ఉదయశ్రీ, నాయకులు అశోక్, వెంకటేశ్, రాంచందర్,తదితరులున్నారు.