కోహీర్, జూన్30 : ఈత చెట్ల పెంపకంతో గౌడన్నలకు ఆదాయం లభిస్తుందని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు పేర్కొన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని మద్రి గ్రామంలో హరితహారం నిర్వహణలో భాగంగా ఎక్సైజ్ శాఖాధికారులతో కలిసి ఈత మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గౌడన్నల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వారి పొలాల్లో నాటేందుకు ఈత మొక్కలను ఉచితంగా అందజేస్తున్నదన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కిశోర్గౌడ్ చేనులో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచులు రమేశ్, రాజశేఖర్, నర్సింహులు, రవికిరణ్, ఎంపీటీసీ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.