కంది, సెప్టెంబర్ 16: మత్స్యకారుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలన్న సంకల్పంతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. శనివారం కంది-చిమ్నాపూర్ పాత చెరువులో మంత్రి హరీశ్రావు 92 వేల చేప పిల్లలను చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్తో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఉచితంగా చెరువుల్లో చేప పిల్లలు వదలడంతో పాటు సబ్సిడీపై వలలు, వాహనాలను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.
అంతకుముందు చెరువు గట్టుపై గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సంగారెడ్డి కలెక్టర్ శరత్, ఎస్పీ రమణకుమార్, ఎంపీపీ సరళా పుల్లారెడ్డి, జడ్పీటీసీ కొండల్రెడ్డి, కంది, చిమ్నాపూర్ విమలా వీరేశం, ప్రమీల, డీసీసీబీ వైస్చైర్మన్ పట్నం మాణిక్యం, ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణగౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఖాజాఖాన్, ఎంపీటీసీలు నందకిశోర్, శ్రీనివాస్, మత్స్యకారుల సహకార సంఘం అధ్యక్షుడు వీరన్న, తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీవో విశ్వప్రసాద్, మత్స్యశాఖ అధికారి సంతోష్కుమార్, మత్స్యకారులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.